AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ వేళ.. వారికి భారీగా పెరిగిన గిరాకీ..!

Astrologers: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఇళ్లకే పరిమితమైన భారతీయులు తమ భవిష్యత్తుపై ఆస్ట్రాలజీని ఆశ్రయిస్తుండడంతో ఇప్పుడు జ్యోతిష్కులకు భారీగా గిరాకీ పెరిగింది. ప్రత్యేకించి ఫోన్‌ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా సమాధానాలు చెబుతున్న జ్యోతిష్కులు రెండు చేతులా సంపాదిస్తున్నట్టు కనిపిస్తోంది. వివరాల్లోకెళితే.. మూతపడిన పరిశ్రమలు, ఫైనాన్షియల్ మార్కెట్లపైనే జనాలకు ఎక్కువగా బెంగపట్టుకున్నట్టు ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో చాలామంది ఆరోగ్య పరిస్థితిపై […]

లాక్ డౌన్ వేళ.. వారికి భారీగా పెరిగిన గిరాకీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2020 | 5:43 PM

Share

Astrologers: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఇళ్లకే పరిమితమైన భారతీయులు తమ భవిష్యత్తుపై ఆస్ట్రాలజీని ఆశ్రయిస్తుండడంతో ఇప్పుడు జ్యోతిష్కులకు భారీగా గిరాకీ పెరిగింది. ప్రత్యేకించి ఫోన్‌ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా సమాధానాలు చెబుతున్న జ్యోతిష్కులు రెండు చేతులా సంపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.

వివరాల్లోకెళితే.. మూతపడిన పరిశ్రమలు, ఫైనాన్షియల్ మార్కెట్లపైనే జనాలకు ఎక్కువగా బెంగపట్టుకున్నట్టు ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో చాలామంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తుండగా.. యువతరం తమ కెరీర్ గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారట. అడపాదడపా కొందరు ప్రేమికులు కూడా తమకు ఫోన్ చేసి ఈ ఏడాది తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఆరాతీస్తున్నట్టు పండితులు వెల్లడించారు.

కాగా.. గత కొద్ది రోజులుగా.. ప్రతి రోజూ వంద నుంచి 250 ఫోన్ కాల్స్ పెరిగాయని ఆస్ట్రోయోగి వెబ్‌సైట్ చీఫ్ ఆదిత్య కపూర్ వెల్లడించారు. 22 నుంచి 40 ఏళ్ల లోపువారే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారనీ.. అధిక శాతం మంది తమ కెరీర్ పరిస్థితిపైనే ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన తెలిపారు. దాదాపు 400 మంది జ్యోతిష్కులున్న ఈ వెబ్‌సైట్లో… తమకున్న పాపులారిటీని బట్టి పండితులు ఒక్కో నిమిషానికి రూ.12 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్టు ఆదిత్య తెలిపారు.

అయితే.. దిగ్గజ ఆస్ట్రాలజీ వెబ్‌సైట్ ఆస్ట్రోసేజ్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ పాండే మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో మా ఆదాయం 42 శాతం పెరిగింది. మా ఈ-మెయిల్ కన్సల్టేషన్లకు బాగా ప్రాచుర్యం ఉంది. ఒక్కో ప్రశ్నకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జ్ చేస్తాం. అదే ఫోన్ కాల్ అయితే 15 నిమిషాలకు రూ.400 వరకు ఖర్చవుతుంది..’’ అని తెలిపారు. దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఎన్నారైలు సైతం తమను సంప్రదిస్తున్నట్టు జ్యోతిష్కులు పేర్కొన్నారు.