AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత ఎమ్మెల్యేలకు షాకిచ్చిన బీజేపీ అధినేత

సొంత పార్టీ ఎమ్మెల్యేలకు షాకిచ్చింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు...

సొంత ఎమ్మెల్యేలకు షాకిచ్చిన బీజేపీ అధినేత
Rajesh Sharma
|

Updated on: Oct 12, 2020 | 7:19 PM

Share

BJP chief shocks own MLAs: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు షాకిచ్చింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డాను కలిసేందుకు న్యూఢిల్లీకి రాగా వారిని కలిసేందుకు ఆయన తిరస్కరించారు. అధ్యక్షుని వైఖరితో ఖంగుతిన్న బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు సమాచారం.

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును మంటగలుపుతున్నారని ఆరోపిస్తున్న పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం విప్లవ్‌ దేవ్‌ కుమార్‌ను పదవి నుంచి తప్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు న్యూఢిల్లీకి వచ్చారు. సీఎంకు వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి, ఎమ్మెల్యే సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ సారథ్యంలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసేందుకు అపాయింట్‌మెంటు కోరారు. అయితే బీహార్ ఎన్నికల విషయంలో తాను బిజీగా వున్నానంటూ నడ్డా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలిసేందుకు అయిష్టత వ్యక్తం చేశారు.

Also read:  హలాల్ నిషేధానికి సుప్రీం నో

Also read: వెంకయ్య ఆరోగ్యంపై కీలక ప్రకటన

Also read: హైదరాబాద్ ప్రజలకు 72 గంటల వార్నింగ్

Also read: ‘ఆ’ భవనాలను ఖాళీ చేయించండి: కేటీఆర్ ఆదేశం

Also read: కమలదళంలోకి ఖుష్బూ

Also read: ఉద్యోగులకు టీటీడీ బ్రహ్మోత్సవ కానుక