AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఎంపీ డ్రైవర్ చేసిన నిర్వాకం..! నెట్టింట వైరలవుతున్న వీడియో.. నెటిజన్ల ఫైర్‌..

తనను కారు బ్యానెట్ పైకి నెట్టుకొని దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించాడని బాధితుడు వాపోయాడు. తాను కారు ఆపమని ఎంత బతిమాలుకునప్పటికీ అతడు..మాట వినలేదని, కారు ఆపలేదని బాధితుడు పోలీసులకు వివరించాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన కారు బానెట్‌పైకి ఎక్కి నానా బీభత్సం చేశాడని ఎంపీ డ్రైవర్ చెబుతున్నాడు.

ఆ ఎంపీ డ్రైవర్ చేసిన నిర్వాకం..! నెట్టింట వైరలవుతున్న వీడియో.. నెటిజన్ల ఫైర్‌..
Delhi Man Dragged
Jyothi Gadda
|

Updated on: May 01, 2023 | 5:55 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కారు డ్రైవరు ఓ వ్యక్తిని కారు బానెట్‌కు వేలాడదీసుకుని ఢిల్లీ రోడ్లపై మూడు కిలోమీటర్ల మేర కారు నడుపుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. ఏప్రిల్ 30 ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వైపు వస్తున్న కారు బానెట్‌పై ఒక వ్యక్తిని సుమారు 2-3 కిలోమీటర్లు లాగారు. కాగా, కారు నడిపిన నిందితుడు బీహార్ ఎంపీ డ్రైవర్‌గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఎంపీ డ్రైవర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించగా…

ఆదివారం ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వరకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు ఓ వ్యక్తి కారు బానెట్‌కు తగిలించుకుని వెళ్లాడు. కారు బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ చందన్‌సింగ్‌కు చెందినదని, ఆ కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఎంపీ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, బాధితుడు.. తాను ఒక సాధారణ డ్రైవర్ అని, ఓ ప్రయాణికుడిని దింపి తిరిగి వస్తుండగా, తన పట్ల ఎంపీ డ్రైవర్ చేతన్ ఇలా ప్రవర్తించాడని బాధితుడు రాంచంద్ కుమార్ తెలిపాడు. తన కారును రాంచంద్ వచ్చి ఢీ కొట్టాడని, ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించినందుకు.. తనను కారు బ్యానెట్ పైకి నెట్టుకొని దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించాడని బాధితుడు వాపోయాడు. తాను కారు ఆపమని ఎంత బతిమాలుకునప్పటికీ అతడు..మాట వినలేదని, కారు ఆపలేదని బాధితుడు పోలీసులకు వివరించాడు.

ఈ కేసులో ర్యాష్ డ్రైవింగ్, ప్రాణహాని వంటి సెక్షన్ల కింద సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వాహనం రవీంద్ర సింగ్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేయబడిందని గుర్తించారు.

కాగా, నిందితుడు రాంచంద్ కుమార్ వాదన మరోలా ఉంది..తన కారు అతని కారును ఢీకొట్టలేదని చెప్పాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన కారు బానెట్‌పైకి ఎక్కి నానా బీభత్సం చేశాడని ఎంపీ డ్రైవర్ చెబుతున్నాడు. తాను అతనిని దిగమని అడిగాను, అతను వినలేదు. నేను మళ్లీ నా కారు.” ఆపి, నువ్వు ఏం చేస్తున్నావు? అని నిలదీశానంటూ చెప్పుకొచ్చాడు. కాగా, పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు