AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bahubali Kattappa Poster: మహారాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి పోస్టర్.. ద్రోహులు అంటూ.. వారి ఫోటోలు!

శివసేన కార్యకర్తలు తిరుబాటు ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో శివసేన రెబల్ ఎమ్మేల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు

Bahubali Kattappa Poster: మహారాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి పోస్టర్.. ద్రోహులు అంటూ.. వారి ఫోటోలు!
Bahubali Kattappa Poster
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2022 | 2:48 PM

Share

మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన.. మరోవైపు తిరుగుబాటు నేతలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు తిరుబాటు ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో శివసేన రెబల్ ఎమ్మేల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పోస్టర్లను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే అనుచరులు సైతం శివసేన నాయకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచిన సీన్‌ లాంటి పోస్టర్‌‌ను శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ‘‘గౌహతిలో దాక్కున్న ద్రోహులను.. దేశం మొత్తం చూస్తుంది.. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరు.. ’’ అని పెద్ద పెద్ద పదాలతో రాసిన పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలిక తర్వాత, శివసేన సీనియర్ నాయకుడు మరియు క్యాబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు జూన్ 22 నుండి అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్‌లో క్యాంప్ చేస్తున్నారు. తనకు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు మినహా మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. అంతకుముందు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సూరత్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళానికి బీజేపీయే కారణమని శివసేన మరోసారి నిందించింది. సామ్నాలో రావ్ సాహెబ్ దాన్వే ప్రకటనలో అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనల్లో తమ హస్తం లేదని బీజేపీ చెబుతుండగా, రావ్ సాహెబ్ దాన్వే ప్రకటనతో అంతా తేలిపోయింది. దీనితో పాటు, మహారాష్ట్రను మూడు ముక్కలు చేయడానికి ఢిల్లీలో కూర్చున్న బిజెపి నాయకులు ప్రమాదకరమైన కుట్ర పన్నారని శివసేన సామ్నాలో ఆరోపించింది.

ఇదిలా ఉంటే, మరోవైపు మహారాష్ట్రలో రాజకీయాలు గంట గంటకూ మారుతున్నాయి. తాజాగా ప్రతిపక్షనేత దరేకర్ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. దీనిపై గవర్నర్ కొష్యారి మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నిధులు, జీవో విడుదల పై వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?