AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bahubali Kattappa Poster: మహారాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి పోస్టర్.. ద్రోహులు అంటూ.. వారి ఫోటోలు!

శివసేన కార్యకర్తలు తిరుబాటు ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో శివసేన రెబల్ ఎమ్మేల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు

Bahubali Kattappa Poster: మహారాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి పోస్టర్.. ద్రోహులు అంటూ.. వారి ఫోటోలు!
Bahubali Kattappa Poster
Jyothi Gadda
|

Updated on: Jun 28, 2022 | 2:48 PM

Share

మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన.. మరోవైపు తిరుగుబాటు నేతలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు తిరుబాటు ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో శివసేన రెబల్ ఎమ్మేల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పోస్టర్లను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే అనుచరులు సైతం శివసేన నాయకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచిన సీన్‌ లాంటి పోస్టర్‌‌ను శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ‘‘గౌహతిలో దాక్కున్న ద్రోహులను.. దేశం మొత్తం చూస్తుంది.. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరు.. ’’ అని పెద్ద పెద్ద పదాలతో రాసిన పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలిక తర్వాత, శివసేన సీనియర్ నాయకుడు మరియు క్యాబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు జూన్ 22 నుండి అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్‌లో క్యాంప్ చేస్తున్నారు. తనకు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు మినహా మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. అంతకుముందు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సూరత్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళానికి బీజేపీయే కారణమని శివసేన మరోసారి నిందించింది. సామ్నాలో రావ్ సాహెబ్ దాన్వే ప్రకటనలో అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనల్లో తమ హస్తం లేదని బీజేపీ చెబుతుండగా, రావ్ సాహెబ్ దాన్వే ప్రకటనతో అంతా తేలిపోయింది. దీనితో పాటు, మహారాష్ట్రను మూడు ముక్కలు చేయడానికి ఢిల్లీలో కూర్చున్న బిజెపి నాయకులు ప్రమాదకరమైన కుట్ర పన్నారని శివసేన సామ్నాలో ఆరోపించింది.

ఇదిలా ఉంటే, మరోవైపు మహారాష్ట్రలో రాజకీయాలు గంట గంటకూ మారుతున్నాయి. తాజాగా ప్రతిపక్షనేత దరేకర్ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. దీనిపై గవర్నర్ కొష్యారి మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నిధులు, జీవో విడుదల పై వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే