AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terrorist Attack: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. బాబా వాంగ జోస్యం నిజమవుతోందా..? వామ్మో అదే జరిగితే..

బల్గేరియన్ సైకిక్ బాబా వంగా, తరచుగా 'నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్' అని పిలుస్తారు.. ఆమె ప్రవచనాలకు ప్రసిద్ధి చెందడం.. అవే నిజమవుతుండటం.. డిజిటల్ ప్రపంచంలో, వార్తా మాధ్యమాలలో విస్తృత చర్చకు దారితీసింది. అయితే.. పహల్గామ్ దాడి తర్వాత బాబా వాంగ జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది..

Pahalgam Terrorist Attack: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. బాబా వాంగ జోస్యం నిజమవుతోందా..? వామ్మో అదే జరిగితే..
Pahalgam Terrorist Attack
Shaik Madar Saheb
|

Updated on: Apr 27, 2025 | 10:59 AM

Share

బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని.. బాబా వంగ జోస్యం చాలా సందర్భాలలో నిజమైనది.. అయితే.. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ఆమె చెప్పిన విషయాలు.. సందర్భానుగుణంగా వార్తల్లో నిలుస్తుంటాయి.. అందుకే.. బల్గేరియన్ సైకిక్ బాబా వంగా, తరచుగా ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని పిలుస్తారు.. ఆమె ప్రవచనాలకు ప్రసిద్ధి చెందడం.. అవే నిజమవుతుండటం.. డిజిటల్ ప్రపంచంలో, వార్తా మాధ్యమాలలో విస్తృత చర్చకు దారితీసింది. అయితే.. పహల్గామ్ దాడి తర్వాత బాబా వాంగ జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.. అందమైన కశ్మీరంలో అమాయకుల ప్రాణాలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా 28 మంది పొట్టనబెట్టుకున్నారు.. చాలా మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వెతికి మరీ, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య.. దేశంతోపాటు.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి.. ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.. భారత్ కూడా పాకిస్తాన్ పై ఆంక్షలు విధించింది.. ఉగ్రవాదుల ఏరివేతతోపాటు.. పలు కీలక ఆదేశాలు జారీచేసింది. అయితే.. పహల్గామ్‌లో జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడితో బాబా వంగా ప్రవచనాలు మరోసారి తెరపైకి వచ్చాయి.. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన ఈ క్రూరమైన చర్య.. 1996లో మరణించిన బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త అంచనాలను, ప్రవచనాలను చాలా మంది తిరిగి గుర్తుచేసుకునేలా చేసింది..

బాబా వంగ అంచనాలివే..

బాబా వంగా అంచనాలు, వివిధ వివరణల ప్రకారం.. బాబా వంగా 2043 నాటికి ప్రపంచ ఇస్లామిక్ ఆధిపత్యాన్ని అంచనా వేశారు. 2043 నాటికి ముస్లిం సమాజం యూరప్‌లో గొప్ప రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. 2025 నుంచి ఒక పెద్ద సంఘర్షణ ప్రారంభమవుతుందని.. అది వినాశనానికి దారితీస్తుందని ఆమె అంచనా వేశారు. అయితే.. పహల్గామ్ మారణహోమం దృష్ట్యా, పెరుగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి ఆమె ముందే హెచ్చరించడం.. అలాగే.. ప్రస్తుత పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న పహల్గామ్ సంఘటన తీరును.. ఉదహరిస్తున్నారు. 2025లో ప్రపంచ వ్యాప్తంగా అశాంతి తలెత్తే అవకాశం ఉందని, అందులో యూరప్‌లో పెద్ద ఘర్షణలు కూడా ఉంటాయని ఆమె ముందే ఊహించినట్లు తెలుస్తోంది. దక్షిణాసియాతో సహా వివిధ ప్రాంతాలలో విస్తృత అస్థిరత తలెత్తే అవకాశం ఉందని ఆమె భావించారని పేర్కొంటున్నారు.

అయితే.. ప్రపంచంలోని చాలామంది వంగాను ఇలాంటి సంఘటనలను ముందుగానే ఊహించిన పవర్‌ఫుల్ మహిళగా భావిస్తారు.. ఎందుకంటే.. ఆమె అంచనా వేసిన దాని ప్రకారం.. 9/11 దాడులు, యువరాణి డయానా మరణం, చైనా ఒక సూపర్ పవర్ గా ఎదుగుదల.. ఇలాంటివి చాలా ఉన్నాయి.. అయితే, ఆమె ప్రవచనాలు చాలా ప్రసిద్ధి చెందడంతోపాటు.. వివాదాస్పదంగా మారాయి.. అస్పష్టమైన భాష.. పునరాలోచన వివరణ తరచుగా ఆమె అంచనాల చుట్టూ ఉన్న కథనాలను రూపొందిస్తాయని సంశయవాదులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదం వంటి సున్నితమైన సందర్భాలలో, అటువంటి అంచనాలను రాజకీయం చేయడం లేదా సంచలనాత్మకంగా మార్చకుండా పండితులు హెచ్చరిస్తున్నారు.

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు: మరో దార్శనికత?

పహల్గామ్ దాడి తరువాత, భారతదేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందని బాబా వంగా చెప్పిన అంచనాను కూడా విశ్వాసులు ఉదహరిస్తున్నారు. ఇది సైనిక ప్రతీకార చర్యను సూచిస్తుందా, దౌత్యపరమైన ఒంటరితనాన్ని సూచిస్తుందా లేదా విస్తృత భౌగోళిక రాజకీయ మార్పులను సూచిస్తుందా అనేది అస్పష్టంగానే ఉంది.. కానీ ఈ సంభాషణ ప్రజా చర్చలో నిస్సందేహంగా వెలుగు చూసింది.

భిన్నాభిప్రాయాలు

బాబా వంగా మాటలను కొందరు ప్రవచనాత్మక హెచ్చరికగా భావిస్తుండగా, మరికొందరు వాటిని సంక్షోభ సమయాల్లో తీసిన యాదృచ్చిక.. అతిశయోక్తి సంబంధాలుగా తోసిపుచ్చారు. ఏదేమైనా, ఆమె 2025 అంచనాలను తిరిగి తెరపైకి తీసుకురావడం – ముఖ్యంగా ఇప్పటికే పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు.. అస్థిర పరిస్థితికి ఒక భయంకరమైన సందర్భానికి ఉదాహరణగా మారింది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!