AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామమందిరంతో మారనున్న దేశ పర్యాటక ముఖ చిత్రం.. ఏటా 5 కోట్ల మంది..

ఇదిలా ఉంటే విగ్రహ ప్రతిష్ట రోజు కేవలం ప్రముఖులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక జనవరి 23వ తేదీ నుంచి భక్తులందరికీ బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. రామమందిర నిర్మాణంతో దేశ పర్యాటక ముఖ చిత్రం మారనుందని అంచనా...

Ayodhya: రామమందిరంతో మారనున్న దేశ పర్యాటక ముఖ చిత్రం.. ఏటా 5 కోట్ల మంది..
Ayodhya
Narender Vaitla
|

Updated on: Jan 22, 2024 | 4:53 PM

Share

దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామ మందిర కల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరాడు. ఈ అద్భుత ఘట్టాన్ని ఒక్క భారతీయులే కాకుండా యావత్‌ ప్రపంచవ్యాప్తంగా భక్తులు వీక్షించారు. 500 ఏళ్ల కల నిజమైన వేళ.. దేశమంతా రామనామంతో మారుమోగింది. ఊరువాడ అంతా యజ్ఞాలు, యాగాలు, ర్యాలీలతో హిందువులు హోరెత్తించారు.

ఇదిలా ఉంటే విగ్రహ ప్రతిష్ట రోజు కేవలం ప్రముఖులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక జనవరి 23వ తేదీ నుంచి భక్తులందరికీ బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. రామమందిర నిర్మాణంతో దేశ పర్యాటక ముఖ చిత్రం మారనుందని అంచనా వేస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ప్రతీ రోజూ సుమారు లక్ష నుంచి లక్షన్న వరకు భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది.

అయోధ్య దేశంలో నూతన పర్యాటక కేంద్రంగా మారనుందని పలు సంస్థలు భావిస్తున్నాయి. ఏటా అయోధ్యకు సుమారు 5 కోట్ల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని సంస్థలు చెబుతున్నారు. అయోధ్యలో అధునాతన హోటల్స్‌ అందుబాటులోకి రావడం, రోడ్డు వ్యవస్థ మెరుగుపడడం, రైల్వే స్టేషన్‌ పునరుద్ధరించడం, ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో పర్యాటం పుంచుకోనుందని జెఫరీస్‌ తన నివేదికలో తెలిపింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామాలయ నిర్మాణం 80 శాతం పూర్తికాగా ఇంకా కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. కేవలం ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా అయోధ్య నగరాన్ని మొత్తం పుననిర్మించారు. దీంతో అయోధ్య నగరం రూపురేఖలు కూడా మారిపోయాయి. యాత్రికుల పెరుగుదలతో పాటు, అనేక రంగాలు ఊపందుకోనున్నాయి. దేశ పర్యాటక రంగానికి అయోధ్య కొత్త మోడల్‌గా మారనుందని జెఫరీస్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది