AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామమందిరంతో మారనున్న దేశ పర్యాటక ముఖ చిత్రం.. ఏటా 5 కోట్ల మంది..

ఇదిలా ఉంటే విగ్రహ ప్రతిష్ట రోజు కేవలం ప్రముఖులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక జనవరి 23వ తేదీ నుంచి భక్తులందరికీ బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. రామమందిర నిర్మాణంతో దేశ పర్యాటక ముఖ చిత్రం మారనుందని అంచనా...

Ayodhya: రామమందిరంతో మారనున్న దేశ పర్యాటక ముఖ చిత్రం.. ఏటా 5 కోట్ల మంది..
Ayodhya
Narender Vaitla
|

Updated on: Jan 22, 2024 | 4:53 PM

Share

దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామ మందిర కల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరాడు. ఈ అద్భుత ఘట్టాన్ని ఒక్క భారతీయులే కాకుండా యావత్‌ ప్రపంచవ్యాప్తంగా భక్తులు వీక్షించారు. 500 ఏళ్ల కల నిజమైన వేళ.. దేశమంతా రామనామంతో మారుమోగింది. ఊరువాడ అంతా యజ్ఞాలు, యాగాలు, ర్యాలీలతో హిందువులు హోరెత్తించారు.

ఇదిలా ఉంటే విగ్రహ ప్రతిష్ట రోజు కేవలం ప్రముఖులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక జనవరి 23వ తేదీ నుంచి భక్తులందరికీ బాలరాముడి దర్శనం కల్పించనున్నారు. రామమందిర నిర్మాణంతో దేశ పర్యాటక ముఖ చిత్రం మారనుందని అంచనా వేస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ప్రతీ రోజూ సుమారు లక్ష నుంచి లక్షన్న వరకు భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది.

అయోధ్య దేశంలో నూతన పర్యాటక కేంద్రంగా మారనుందని పలు సంస్థలు భావిస్తున్నాయి. ఏటా అయోధ్యకు సుమారు 5 కోట్ల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని సంస్థలు చెబుతున్నారు. అయోధ్యలో అధునాతన హోటల్స్‌ అందుబాటులోకి రావడం, రోడ్డు వ్యవస్థ మెరుగుపడడం, రైల్వే స్టేషన్‌ పునరుద్ధరించడం, ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో పర్యాటం పుంచుకోనుందని జెఫరీస్‌ తన నివేదికలో తెలిపింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామాలయ నిర్మాణం 80 శాతం పూర్తికాగా ఇంకా కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. కేవలం ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా అయోధ్య నగరాన్ని మొత్తం పుననిర్మించారు. దీంతో అయోధ్య నగరం రూపురేఖలు కూడా మారిపోయాయి. యాత్రికుల పెరుగుదలతో పాటు, అనేక రంగాలు ఊపందుకోనున్నాయి. దేశ పర్యాటక రంగానికి అయోధ్య కొత్త మోడల్‌గా మారనుందని జెఫరీస్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?