AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AN-32 ప్రమాదం.. విధి నిర్వహణలో వీరమరణం.. ఐదుగురు జవాన్ల త్యాగానికి దేశం ఘన నివాళి!

అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైన ఘటన విషాదాన్ని నింపింది. శనివారం (జూన్ 13) ల్యాండింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు వైమానిక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, కో-పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం అధికారికంగా స్పందిస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.

AN-32 ప్రమాదం.. విధి నిర్వహణలో వీరమరణం.. ఐదుగురు జవాన్ల త్యాగానికి దేశం ఘన నివాళి!
Assam Iaf Aircraft An 32 Crash
Balaraju Goud
|

Updated on: Jun 13, 2026 | 3:51 PM

Share

అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైన ఘటన విషాదాన్ని నింపింది. శనివారం (జూన్ 13) ల్యాండింగ్ సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు వైమానిక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, కో-పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం అధికారికంగా స్పందిస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.

ప్రమాదంలో మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్వాయు ఖేమరం కుమావత్, అగ్నివీర్వాయు డానిష్ ఆలం‌గా గుర్తించారు. వీరి మృతితో భారత వైమానిక దళం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉంటామని ఐఏఎఫ్ పేర్కొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, AN-32 విమానం జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అనంతరం విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే అప్పటికే ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కో-పైలట్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, ల్యాండింగ్ సమయంలో ఏర్పడిన సమస్యలా, లేక మరేదైనా కారణమా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయడానికి భారత వైమానిక దళం కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేసింది.

దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు వీర జవాన్లకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ విషాద ఘటన భారత వైమానిక దళాన్ని మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని కలచివేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ