Bengaluru rains: బెంగళూరులో ‘వరుణ’ మృదంగం.. భారీ వర్షానికి మరో ఇద్దరు మృతి..
చిన్నవానకే చివురుటాకులా వణికిపోయే బెంగుళూరులో కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. అండర్పాస్లు.. నాలాలు.. మ్యాన్హోల్స్.. ఇవే కాకుండా మనషులను మింగేస్తోంది ఈ భారీ వర్షం. ఇవాళ మరో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే వర్షాలకు నిన్న తెలుగు అమ్మాయి మృతి చెందగా.. ఇవాళ మరో యువకుడు అదే వర్షానికి బలి అయ్యాడు.
చిన్నవానకే చివురుటాకులా వణికిపోయే బెంగుళూరులో కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. అండర్పాస్లు.. నాలాలు.. మ్యాన్హోల్స్.. ఇవే కాకుండా మనషులను మింగేస్తోంది ఈ భారీ వర్షం. ఇవాళ మరో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే వర్షాలకు నిన్న తెలుగు అమ్మాయి మృతి చెందగా.. ఇవాళ మరో యువకుడు అదే వర్షానికి బలి అయ్యాడు. భారీ వర్షంతో వరద నీటికి కొట్టుకుపోయాడు. నిన్న కొట్టుకుపోయిన యువకుడు ఇవాళ శవమై తేలాడు.
ఇక నిన్న ఇదే బెంగుళూరు మహా నగరంలో కురిసిన కుండపోత వర్షం ఓ తెలుగు కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తోన్న భాను రేఖ అనే తెలుగు యువతి నీటమునిగిన కారులో చిక్కుకుపోయి చనిపోయింది..కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. బాధితులు కృష్ణా జిల్లాకి చెందిన తేలప్రోలు వాసులు. ఓ వారం రోజులు వేసవి సెలవులకు బెంగుళూరుకి వచ్చిన ఈ కుటుంబం క్యాబ్ బుక్చేసుకొంది.అదే ఆ కుటుంబానికి మృత్యుశకటంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..