AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrit Bharat Station Scheme: రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పేరుతో రైల్వే ఛార్జీలు పెరగవు.. రైల్వే మంత్రి క్లారిటీ..

రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే రైలు ఛార్జీలు పెరుగుతాయాంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు రైల్వే మంత్రి. రైల్వే స్టేషన్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు రైలు ఛార్జీలను పెంచబోమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామంటూ హామీ ఇచ్చారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారని అన్నారు. రైల్వే స్టేషన్‌ అభివృద్ధి లక్ష్యం కూడా అదే అని అన్నారు. రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్ కోసం 9000 మంది ఇంజనీర్లకు రైల్వే శిక్షణ ఇస్తోంది. భద్రతతోపాటు పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

Amrit Bharat Station Scheme:  రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పేరుతో రైల్వే ఛార్జీలు పెరగవు.. రైల్వే మంత్రి క్లారిటీ..
Minister Ashwini Vaishnaw
Sanjay Kasula
|

Updated on: Aug 07, 2023 | 12:06 PM

Share

అభివృద్ధి చేస్తే టికెట్ ఛార్జీలు పెరుగుతాయా.. అంటూ వస్తున్న ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.  దేశంలోని దాదాపు 1300 రైల్వే స్టేషన్లు కొత్తగా మారిపోతున్నాయి. ఇందులో 508 స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. 25 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు కింద తెలంగాణలో 21, ఏపీలో 18 స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తే రైలు ఛార్జీలు పెరుగుతాయా..? ఇంత భారీ మొత్తంలో సామాన్యుల నుంచి వసూలు చేస్తారా..? ఇలాంటి ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. ఎట్టకేలకు అందరి ప్రశ్నలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎండ్ కార్డు వేశారు. రైల్వే స్టేషన్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు రైలు ఛార్జీలను పెంచబోమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామంటూ హామీ ఇచ్చారు.

అమృత్ భారత్ స్టేషన్ ప్రాజెక్ట్ కింద దేశంలోని వివిధ ప్రాంతాలలో 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూ.25 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత రైలు ఛార్జీలు, స్టేషన్ ఖర్చులపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణబ్ విలేకరుల సమావేశం పెట్టి అందరి ఆందోళనలకు తెరదించారు. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారని అన్నారు. రైల్వే స్టేషన్‌ అభివృద్ధి లక్ష్యం కూడా అదే అని అన్నారు. వారికి ఎలాంటి భారం లేకుండా ప్రపంచ స్థాయి స్టేషన్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం. స్టేషన్ డెవలప్‌మెంట్ పేరుతో మేము రైలు ఛార్జీలను పెంచేది లేన్నారు. ఎటువంటి స్పెషల్ ఛార్జీలు కూడా  వసూలు చేయమంటూ తేల్చి చెప్పారు.

ఈ రోజున రైల్వే మంత్రి మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసే ప్రాజెక్ట్ కోసం 9 వేల మంది ఇంజనీర్లకు రైల్వే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. భద్రతతోపాటు పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు నుంచి ఏ రాష్ట్రానికి నష్టం జరగదని రైల్వే మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేరళ బందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోవడంపై పినరయి విజయన్ ప్రభుత్వంపై అశ్విని వైష్ణవ్ మండిపడ్డారు. పినరయి విజయన్ ప్రభుత్వ సర్వే నివేదికతో సహా సమగ్ర సమాచారాన్ని అందించడంలో ఇబ్బంది ఉన్నందున కేరళలో రైల్వే నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసే పనులకు ఆటంకం కలుగుతోందని రైల్వే మంత్రి ఆరోపించారు. అయితే, కేరళలో రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అశ్విని వైష్ణవ్ కూడా చెప్పారు

యాదృచ్ఛికంగా ఈ రోజు 508 స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన జరిగింది. 37 స్టేషన్లు పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. దీనికి 1503 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి 55 స్టేషన్లకు 4 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. మధ్యప్రదేశ్‌లోని 34 స్టేషన్‌లకు 1,000 కోట్లు, మహారాష్ట్రలో 44 స్టేషన్‌లకు 1,500 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లోని పలు స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కిందకు తీసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం