AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra: పవిత్ర చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి..! 600లకు పైగా గుర్రాలు కూడా.. హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం..ఆదివారం నాడు 4,308 మంది యాత్రికులు బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. రెండునెలల్లోనే కేదార్‌నాథ్‌ యాత్ర మార్గంలో..

Char Dham Yatra: పవిత్ర చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి..! 600లకు పైగా గుర్రాలు కూడా.. హైకోర్టు ఆగ్రహం
Char Dham Yatra
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2022 | 5:43 PM

Share

Char Dham Yatra: ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది. అయితే రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం..ఆదివారం నాడు 4,308 మంది యాత్రికులు బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. రెండునెలల్లోనే కేదార్‌నాథ్‌ యాత్ర మార్గంలో 97 మంది, బద్రీనాథ్‌ ధామ్‌ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది మరణించినట్టు ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నది.

ఈ నేపథ్యంలోనే మే 3 నుంచి ఇప్పటివరు 25 లక్షల మందికిపైగా యాత్రికులు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని వెల్లడించింది. అయితే వాతావరణంలో మార్పులు, వర్షాలు పడుతుండటంతో గత వారంరోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కాగా, యాత్రకు రావడానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సూచించింది. ఉత్తరాఖండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి నోటీసుతో చార్‌ధామ్ ప్రాంతంలో వైద్య సదుపాయాలను పటిష్టం చేస్తున్నారు. ప్రస్తుతం, కేదార్‌నాథ్,గౌరీకుండ్‌ పరిసర ప్రాంతాలలో మొత్తం పది వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే సామాజిక కార్యకర్త గౌరీ మౌలేఖి చార్‌ధామ్‌ నిర్వహణ అధికారులకు లేఖ రాశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత మందిని అనుమతించాలి? ఎంతమందికి భోజనం, పానీయాలు, బస అందిస్తారో నిర్ధారించాలి. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త గౌరీ మౌలేఖి కోరారు. చార్‌ధామ్‌ యాత్ర సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి ప్రజలు ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

మరోవైపు, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్‌ధామ్ యాత్రలో జంతువులు అల్లకల్లోలం చేయటం. కొన్ని జంతువులు మృతి చెందడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 600లకు పైగా గుర్రాల మృతిపై కేంద్రం, రాష్ట్రం సహా చార్‌ధామ్‌ యాత్రలోని నాలుగు జిల్లాల డీఎంలకు నైనిటాల్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'