Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIADMK case: ఓపిఎస్, ఈపీఎస్ మధ్య ఐదేళ్లుగా పోరు.. చివరికి నెగ్గింది ఎవరంటే..?

తమిళనాట ఏళ్ల తరబడి అత్యంత వివాదాస్పదంగా మారిన ఏఐఏడీఎంకే చీఫ్ వివాదంపై కోర్టు తీర్పు వెలువడింది. ఏఐఏడీఎంకే పార్టీకి చీఫ్ నేనంటే నేనే అంటూ రెండు వర్గాలుగా విడిపోయిన మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం(ఓపిఎస్), ఈ పలని స్వామి(ఈపిఎస్) చివరకు కోర్టు దాకా వెళ్లారు. సుదీర్ఘ వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.

AIADMK case:  ఓపిఎస్, ఈపీఎస్ మధ్య ఐదేళ్లుగా పోరు.. చివరికి నెగ్గింది ఎవరంటే..?
Panneerselvam, Palaniswami
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Nov 09, 2023 | 6:54 AM

తమిళనాట ఏళ్ల తరబడి అత్యంత వివాదాస్పదంగా మారిన ఏఐఏడీఎంకే చీఫ్ వివాదంపై కోర్టు తీర్పు వెలువడింది. ఏఐఏడీఎంకే పార్టీకి చీఫ్ నేనంటే నేనే అంటూ రెండు వర్గాలుగా విడిపోయిన మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం(ఓపిఎస్), ఈ పలని స్వామి(ఈపిఎస్) చివరకు కోర్టు దాకా వెళ్లారు. సుదీర్ఘ వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. పార్టీ చీఫ్ గా అర్హత ఎవరిదో తేల్చిచెప్పింది.

రెండాకుల పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. జయలలిత మరణాంతర పరిణామాలతో పార్టీలో అనేక మలుపులు తిరిగాయి. మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్, ఓపిఎస్‌లు సంయుక్తంగా పార్టీ బాధ్యతలు చెప్పట్టారు. ఏక నాయకత్వం కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేశారు. వర్గపోరులో బలాబలాల ప్రదర్శనలో పార్టీకి ఎవరు అర్హులు అన్నది తేలలేదు. దీంతో విషయం కోర్టు దాకా వెళ్ళింది..

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న దివంగత జయలలిత మరణాంతర పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. అమ్మ తర్వాత చిన్నమ్మగా పిలవబడే శశికళ అన్నీ తానే అయి నడిపించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కోర్టు తీర్పు పర్యవసానం చిన్నమ్మ జైలుకెళ్లాక పలని స్వామి శశికళకు ఎదురు తిరిగారు. అంతా బాగుంది అనుకుంటుండగా 2017 లో మాజీ సీఎం పన్నీర్ సెల్వం పార్టీలో చీలిక ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కొంతకాలంగా వివాదం తర్వాత ఓపిఎస్, ఈపీఎస్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. పార్టీ బాధ్యతలు ఇద్దరూ కలిసి నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల పార్టీలోకి శశికళను రప్పించాలని ఓపిఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తాజాగా పార్టీ లో ఏక నాయకత్వం రావాలని అది నేనే కావాలని ఓపిఎస్ ప్రయత్నాలు చేశారు. అంతే ధీటుగా ఈపీఎస్ కూడా తన వ్యూహాలకు పదును పెట్టారు. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఏఐఏడీఎంకే పార్టీలో అధ్యక్ష పదవి కంటే ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నిక కోసం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈపిఎస్ ను మెజారిటీ సభ్యులు ఎన్నుకున్నారు. అయితే ఆ సమావేశానికి వచ్చిన ఓపిఎస్ తన వర్గం నేతలను సమావేశానికి రాకుండా చేశారానే ఆరోపణలతో కోర్టును ఆశ్రయించారు. దీంతో మూడేళ్ళ తర్వాత మద్రాస్ హైకోర్టులో తీర్పు వెలువడింది. పార్టీ బైలా.. సభ్యుల తీర్మానం వంటి అంశాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపిఎస్ నియామకం చెల్లుతుందని తీర్పు ఇచ్చింది. దీంతో ఈపిఎస్ వర్గంలో సంబరాలు జరుగితుండగా.. ఓపిఎస్ వర్గంలో అసంతృప్తి నెలకొంది. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఓపిఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
ఒకే ఒక్క సినిమా చేసింది.. కట్ చేస్తే రూ.44,250 కోట్లకు మహారాణి. 
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
మొక్కలు పుష్పించడం లేదా.. బియ్యం బెస్ట్ ఎరువు.. ఎలా యూజ్ చేయాలంటే
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?
లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?