విమాన ప్రమాదంలో స్టార్ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్ కూడా..
గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయి 241 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఒకరు మాత్రమే బయటపడ్డారు. మృతుల లో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బంధువు కూడా ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దేశం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసే ఘటన గురువారం చోటు చేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంతా విమానంలో ఉన్నవాళ్లు అయితే.. విమానం కూలిన బిల్డింగ్లోని మెడికల్ విద్యార్థులు కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ఇందులో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది విమాన సిబ్బంది మరణించారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు 11ఏ సీట్లో కూర్చున్న రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే అదృష్టం కొద్ది బయటపడ్డాడు.
అయితే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన కో పైలెట్ క్లైవ్ కుందర్ ఓ బాలీవుడ్ హీరోకు బంధువు అవుతాడు. క్లైవ్ కుందర్ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బంధువు అని తెలిసింది. దీనిని విక్రాంత్ మాస్సే స్వయంగా ధృవీకరించారు. ’12వ ఫెయిల్’ సినిమాతో ఫేమ్ పొందిన విక్రాంత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన బంధువు క్లైవ్ కుందర్ మరణం పట్ల ఆయన బాధను తెలియజేశారు.
“అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు, ప్రియమైనవారి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. నా మామ క్లిఫోర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ కూడా చనిపోయాడని తెలిసి మరింత బాధగా ఉంది. ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్” అని విక్రాంత్ మాసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. విమాన ప్రమాదం తర్వాత చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు స్పందించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, యష్, అల్లు అర్జున్, రష్మిక మందన్న, రమ్య, అక్షయ్ కుమార్, అలియా భట్, కంగనా రనౌత్, సోను సూద్, రణవీర్ సింగ్ అనేక మంది తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
— Sayyad Nag Pasha (@nag_pasha) June 12, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..