AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం..!

అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

Jammu: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం..!
Encounter In Jammu
Jyothi Gadda
|

Updated on: May 05, 2023 | 4:50 PM

Share

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కాండీ ప్రాంతంలో ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో, ఉగ్రవాదులు పేలుడు పరికరాన్ని పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు. భారత ఆర్మీ ప్రకటన మేరకు..రాజౌరీ సెక్టార్‌లోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందడంతో.. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల మధ్య సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఒక గుహలో ఉన్న ఉగ్రవాదులతో సెర్చ్ టీమ్ సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాంతం రాళ్లు, ఏటవాలు కొండలతో దట్టంగా ఉంది. ఆ తర్వాత భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని పేల్చారు. దాంతో ఐదుగురు సైనికులు మరణించారు. మరొకరు గాయపడ్డారు అని ఆర్మీ పేర్కొంది.

గాయపడిన సిబ్బందిని ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించామని, సమీపంలోని అదనపు బృందాలను ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి తరలించామని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల బృందం దాగి ఉంది. ఉగ్రవాదుల్లోనూ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, రాజౌరి జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ నివేదించింది.

గురువారం, దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌భేరా ప్రాంతంలో భద్రతా దళాలపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఒక పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు