Jammu: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం..!

అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

Jammu: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం..!
Encounter In Jammu
Follow us

|

Updated on: May 05, 2023 | 4:50 PM

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కాండీ ప్రాంతంలో ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో, ఉగ్రవాదులు పేలుడు పరికరాన్ని పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు. భారత ఆర్మీ ప్రకటన మేరకు..రాజౌరీ సెక్టార్‌లోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందడంతో.. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల మధ్య సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఒక గుహలో ఉన్న ఉగ్రవాదులతో సెర్చ్ టీమ్ సంప్రదింపులు జరిపింది. ఈ ప్రాంతం రాళ్లు, ఏటవాలు కొండలతో దట్టంగా ఉంది. ఆ తర్వాత భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని పేల్చారు. దాంతో ఐదుగురు సైనికులు మరణించారు. మరొకరు గాయపడ్డారు అని ఆర్మీ పేర్కొంది.

గాయపడిన సిబ్బందిని ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించామని, సమీపంలోని అదనపు బృందాలను ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి తరలించామని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల బృందం దాగి ఉంది. ఉగ్రవాదుల్లోనూ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, రాజౌరి జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ నివేదించింది.

గురువారం, దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌భేరా ప్రాంతంలో భద్రతా దళాలపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఒక పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..