AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా సెకండ్ వేవ్, దేశంలో ఏ వయస్కులకు రిస్క్ ఎక్కువో తేల్చిన నిపుణులు,

కరోనా సెకండ్ వేవ్ లో ఏ వయస్సువారికి రిస్క్ ఎక్కువ ఉంటుందో నిపుణులు తేల్చారు. ఈ రెండో 'బీభత్సం' లో 40 లేదా అంతకన్నా ఎక్కువ వయస్కులకు ముప్పుఉంటుందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. తాము 9.485 మంది రోగుల

కరోనా సెకండ్ వేవ్,  దేశంలో ఏ వయస్కులకు  రిస్క్ ఎక్కువో తేల్చిన నిపుణులు,
40 Plus More Vulnerable In 2nd Wave Covid 19 Says Icmr Chief Bharagava
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 20, 2021 | 2:30 PM

Share

కరోనా సెకండ్ వేవ్ లో ఏ వయస్సువారికి రిస్క్ ఎక్కువ ఉంటుందో నిపుణులు తేల్చారు. ఈ రెండో ‘బీభత్సం’ లో 40 లేదా అంతకన్నా ఎక్కువ వయస్కులకు ముప్పుఉంటుందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. తాము 9.485 మంది రోగుల డేటాను విశ్లేషించామని, తొలి వేవ్ లో సగటున 50 ప్లస్ వయస్సులవారు  రిస్క్ ఎదుర్కోగా ఈ సెకండ్ వేవ్ లో 40 ప్లస్ వయస్సుల వారు కూడా ఈ ముప్పు ఎదుర్కొన్నట్టు వెల్లడైందని ఆయన చెప్పారు. ఈ రెండో వేవ్ లో 70 శాతం పైగా రోగులు 40 ఏళ్లకు పైబడినవారేనన్నారు. గత ఏడాది కరోనా వైరస్ తో ఆసుపత్రి పాలైన 31 శాతం మందికి పైగా రోగుల్లో పలువురు 30 ఏళ్లలోపువారేనని, ఈ సారి  ఇది 32 శాతం ఉందని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే.పాల్ తెలిపారు.అంటే గత ఏడాదికి, ఈ సారికి పెద్దగా తేడా లేదని వెల్లడైందన్నారు.

ఈ తరుణంలో ఆక్సిజన్ అవసరాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వెంటిలేటర్ ఆవశ్యకత ఎక్కువగా లేదని బలరాం భార్గవ చెప్పారు. మొదటి దశలో చాలామంది పొడిదగ్గు, గొంతు నొప్పితో ఎక్కువగా బాధ పడగా.. ఈ సారి రోగులకు శ్వాస సరిగా ఆడకపోవడం వంటి రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా నీరసం, అలసట, ఒంటి నొప్పులు ఈ దశలోనూ ఉన్నాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోవడం, నిర్లక్ష్యం, మాస్కులు ధరించకపోవడం వంటి వాటి వల్ల ఈ సెకండ్ వేవ్ విజృంభిస్తోందని,  వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉందని భార్గవ పేర్కొన్నారు.  వ్యాక్సిన్ల కొరత ఆందోళన కలిగించేదిగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుధ్ధ ప్రాతిపదికన  చేపట్టాలని ఆయన సూచించారు. అటు మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడినవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఈ చర్య ముందే తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!