AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన 36 రోజులకే.. సమోసాలో పురుగుల మందు కలిపి.. భర్తను హతమార్చిన కొత్త పెళ్లి కూతురు!

మేఘాలయ హనీమూన్‌ హత్యోదంతం మరువకముందే మరో మహిళ తన భర్తను హతమార్చింది. పెళ్లైన కేవలం 36 రోజులకే సమోసాలో పురుగులు మందు కలిపి భర్తకు తినిపించింది. అనంతరం కాసేపటికే భర్త తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లో వెలులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెళ్లైన 36 రోజులకే.. సమోసాలో పురుగుల మందు కలిపి.. భర్తను హతమార్చిన కొత్త పెళ్లి కూతురు!
Bride Kills Husband
Srilakshmi C
|

Updated on: Jun 19, 2025 | 11:29 AM

Share

రాంచీ, జూన్‌ 16: జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో బహోకుదర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్‌ సింగ్‌తో సునీతే దేవి (22)కి గత నెల 11న వివాహం జరిగింది. అనంతరం లాంఛనాల ప్రకారం భర్తతోపాటు మెట్టింటికి వెళ్లనప్పటికీ.. తొలి రోజే ఆమె పుట్టింటికి తిరిగి వెళ్లిపోయింది. అతనితో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో ఇరువైపుల పెద్దలు చర్చించి ఆమెకు సర్దిచెప్పి జూన్‌ 5న కాపురానికి పంపారు. జూన్ 14న పెరట్లోని మొక్కల కోసం పురుగుల మందు అవసరమని భర్తను కోరింది. అంతే భార్య ప్రేమగా మాట్లాడిందన్న ఆనందంలో ఆగమేఘాల మీద వెళ్లి బుద్ధనాథ్‌ పరుగుల మందు కొని తెచ్చాడు.

ఆ మరుసటి రోజే అంటే జూన్‌ 15న భర్త కోసం స్పెషల్‌గా చికెన్‌ కర్రీ వండి.. సమోసాలతో వడ్డించింది. ఆనక పక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. అయితే భోజనం తర్వాత కాసేపటికే బుద్ధనాథ్‌ తీవ్ర అశ్వస్థతకు గురయ్యాడు. బంధువులు అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జూన్‌ 15న జరిగినప్పటికీ మృతుడి బంధువులు కొత్త కోడలిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో సునీత అత్తపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని, ఆ తర్వాత తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించినట్లు రాంకా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) రోహిత్ రంజన్ సింగ్ తెలిపారు.

తన మొదటి ప్రయత్నం విఫలమైతే, బ్యాకప్ ప్లాన్‌గా సునీత తన బ్లౌజ్‌లో మరో రెండు పురుగుమందుల ప్యాకెట్లను భద్రపరిచిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బుద్ధనాథ్ చనిపోయినట్లు నిర్ధారనైన తర్వాత ఆమె మిగిలిన ప్యాకెట్లను సమీపంలోని పొదల్లో పారవేసిందని తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఇతరుల ప్రమేయం కూడా ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..