AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌ దాడి.. విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు.. ముగ్గురు భారత పౌరులు మృతి

మరోవైపు మే7 బుధవారం రోజున దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణతో పాటు, సరిహద్దుల్లో వాయుసేన భారీ విన్యాసాలు చేపట్టాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆయా శాఖలను ఆదేశించింది. మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఊహించిన ఈ ఘటనతో పాక్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

పాకిస్థాన్‌ దాడి.. విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు.. ముగ్గురు భారత పౌరులు మృతి
Operation Sindoor
Jyothi Gadda
|

Updated on: May 07, 2025 | 8:06 AM

Share

పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత మే7న మంగళవారం రాత్రి 1:44 గంటల ప్రాంతంలో భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POK)పై దాడి చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో భారత్‌ పాక్ కు గట్టి బుద్ధి చెప్పింది. ఊహించని భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరకేంగా పాకిస్థాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగింది. పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులకు దిగితే, పాకిస్థాన్ మాత్రం నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుండటంతో ముగ్గురు భారత పౌరులు మరణించినట్లుగా తెలిసింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో జిల్లాలోని LOC వెంట ఉన్న ఉరి సెక్టార్ లో పాక్ ఆర్మీ ఆర్టిలరీ షెల్లింగ్స్ కాల్పులతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు అమాయకులు చనిపోయారు. పూంచ్ అటవీ శాఖ కార్యాలయం కూడా ధ్వంసమైందని తెలిసింది.. మృతులను షాహీన్ నూర్ కుమారుడు మహ్మద్ ఆదిల్, అల్తాఫ్ హుస్సేన్ కుమారుడు సలీం హుస్సేన్, షాలు సింగ్ భార్య రూబీ కౌర్‌గా గుర్తించారు. కాగా, మరికొంతమంది గాయపడ్డారు. ఇందుకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా బదులిస్తుంది.

పహల్‌గామ్ దాడికి ప్రతీకారంగా పాక్‌కు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పింది. అర్థరాత్రి 1.44 గంటలకు పాక్‌లోని 4, పీఓకేలోని 5 ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు జరిపింది. మరోవైపు మే7 బుధవారం రోజున దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణతో పాటు, సరిహద్దుల్లో వాయుసేన భారీ విన్యాసాలు చేపట్టాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆయా శాఖలను ఆదేశించింది. మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఊహించిన ఈ ఘటనతో పాక్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌