సీబీఐ, ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించిన 14 ప్రతిపక్ష పార్టీలు

ఈ మధ్య రాజకీయ నేతలపై సీబీఐ ఈడీ దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఈ దాడులు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా వాడుకుంటుందని..

సీబీఐ, ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించిన 14 ప్రతిపక్ష పార్టీలు
Supreme Court
Follow us

|

Updated on: Mar 24, 2023 | 12:28 PM

ఈ మధ్య రాజకీయ నేతలపై సీబీఐ ఈడీ దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఈ దాడులు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా వాడుకుంటుందని.. కావాలనే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు చేయిస్తోందని ఇదివరకే విపక్ష నాయకులు ఆరోపించారు. అయితే తాజాగా ఈ విషంపై 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐడీ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్ వేసిన వాటిలో కాంగ్రెస్, DMK, RJD, BRS, TMC, AAP, NCP, శివ సేన ఉద్దవ్,JMM, JDU, CPI, CPM, SP పార్టీలు ఉన్నాయి.

అయితే పిటీషన్ లో అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత దర్యాప్తు సంస్థలు పాటిస్తున్న మార్గదర్శకాలేంటో తెలపాలని సుప్రీం కోర్టును కోరాయి. దీనిపై వేగంగా విచారణ చేసేందుకు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింగ్వీ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ఈ విషయాన్ని వివరించారు.సీబీఐ, ఈడీ సంస్థలను పూర్తిగా ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఉన్నాయని అభిషేక్ సింగ్వీ తెలిపారు. అలాగే దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన వారిలో దాదాపు 95 శాతం మంది విపక్ష పార్టీల నేతలే ఉన్నారని పేర్కొన్నారు. అయితే దీనిపై చీఫ్ జస్టీస్ విచారించేందుకు అంగీకరించాడు. ఏప్రిల్ 5న దీనిపై విచారణ చేస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..