AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ..అక్కడ ఏం జరుగుతోంది..?

తీహార్ జైలు అథారిటీ రక్షిత సర్వే విభాగం AIIMS, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో కలిసి మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను కూడా నిర్వహించింది. దీంతో పాటు ఖైదీలకు క్షయ పరీక్షలు కూడా చేశారు. అయితే ఎవరికీ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీలోని సఫ్దర్​ జంగ్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నామని డీజీ సతీష్​ గోల్చా తెలిపారు.

Delhi: తీహార్ జైలులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ..అక్కడ ఏం జరుగుతోంది..?
Tihar Jail
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2024 | 4:31 PM

Share

ఢిల్లీలోని తీహార్ జైలులో వందలాది మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకింది. 200 మంది ఖైదీలు సిఫిలిస్ లక్షణాలతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. తాజాగా ఈ వార్త తెరపైకి రావడంతో ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తీహార్​ జైలులో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా గుర్తించారు. తీహార్ జైలులో తీహార్, రోహిణి, మండోలి అనే మూడు జైళ్లు ఉన్నాయి. ఈ జైళ్లలోనే 125 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకినట్టుగా గుర్తించారు. దీంతో జైలు నిర్వహణలో గందరగోళం నెలకొంది. తీహార్‌ జైల్లో దాదాపు 14,000 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో సుమారు 10 వేల 500 మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా తీహార్​ జైలు డీజీ సతీష్ గోల్చా పలు వెల్లడించారు.

ఈ మేరకు తీహార్​ జైలు డీజీ సతీష్ గోల్చా మాట్లాడుతూ.. తాను నియమితమైన తరువాత మే, జూన్​ లలో 10,500మంది ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో 125మంది ఖైదీలకు హెచ్​ ఐవీ పాజిటివ్​ గా తేలిందన్నారు. అయితే వీరు జైలుకు వచ్చినప్పటికే హెచ్​ ఐవీ సోకిందని వెల్లడించారు. అయితే జైలులో ఉండగా ఎవరికీ హెచ్‌ఐవీ సోకలేదని జైలు అధికారులు పేర్కొంటున్నారు. నేరస్థులు జైలుకు వచ్చినప్పుడే వారికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో వారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా ఎవరికీ హెచ్‌ఐవీ సోకినట్లు కాదన్నారు.

అయితే, జైలులో హెచ్‌ఐవీ బాధితుల కోసం ఏమైనా అదనపు చర్యలు తీసుకున్నారా అనే దానిపై జైలు స్పష్టత ఇవ్వలేదు. హెచ్‌ఐవీతో పాటు 200 మంది ఖైదీలు సిఫిలిస్ వంటి తీవ్రమైన చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. తీహార్ జైలు అథారిటీ రక్షిత సర్వే విభాగం AIIMS, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌తో కలిసి మహిళా ఖైదీలకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను కూడా నిర్వహించింది. దీంతో పాటు ఖైదీలకు క్షయ పరీక్షలు కూడా చేశారు. అయితే ఎవరికీ పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీలోని సఫ్దర్​ జంగ్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నామని డీజీ సతీష్​ గోల్చా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్