AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడి తాగుడు తగలయ్య..12 మందిని పెళ్లి చేసుకుని.. చివరి భార్యను చంపేశాడు

జార్ఖండ్ లో దారుణ ఘటన జరిగింది. 12 మందిని పెళ్లి చేసుకున్న ఓ తాగుబోతు తన చివరి భార్యను కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గిరిదిహ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో రామచంద్ర తురి అనే వ్యక్తి పెళ్లికి ముందే విపరీతంగా తాగేవాడు.

వీడి తాగుడు తగలయ్య..12 మందిని పెళ్లి చేసుకుని.. చివరి భార్యను చంపేశాడు
Death
Aravind B
|

Updated on: Apr 04, 2023 | 3:02 PM

Share

జార్ఖండ్ లో దారుణ ఘటన జరిగింది. 12 మందిని పెళ్లి చేసుకున్న ఓ తాగుబోతు తన చివరి భార్యను కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గిరిదిహ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో రామచంద్ర తురి అనే వ్యక్తి పెళ్లికి ముందే విపరీతంగా తాగేవాడు. అతనికి పెళ్లి చేస్తే మారుతాడని భావించిన తల్లిదండ్రులు ఒక సంబంధం కుదిర్చి వివాహం చేశారు. కానీ రామచంద్ర నిత్యం తాగొచ్చి ఆమెను వేధించేవాడు. టార్చర్ తట్టుకోలేని ఆ మొదటి భార్య అతడ్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత రామచంద్ర మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె కూడా అతని వేధింపులు భరించలేక వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కూడా సేమ్ ఆమె వదిలేసి వెళ్లిపోయింది. ఇలా ఒకరి తర్వాత ఒకరంటూ సుమారు 11 మందిని రామచంద్ర పెళ్లి చేసుకున్నాడు. వాళ్లందరూ కూడా అతను పెట్టే బాధలు భరించలేక వెళ్లిపోయారు.

చివరికి నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న సావిత్రి దేవి అనే మరో మహిళను రామచంద్ర 12వ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె గతంలోనే పెళ్లి చేసుకుంది. కానీ తన భర్త చనిపోవడంతో ముగ్గురు కొడుకులు, ఒక కూతురుతో కలిసి జీవనం సాగిస్తోంది. అయితే రామచంద్ర తీరు మాత్రం ఇంకా మారలేదు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన భార్యతో వాగ్వాదం జరిగింది. కోపంతో రామచంద్ర భార్యపై కర్రతో దాడి చేశాడు. ఆ దెబ్బలను తట్టుకోలేక ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు రామచంద్ర ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
వంకాయ ప్రియులకు పండగే! దీంతో కూర రుచి డబుల్!
వంకాయ ప్రియులకు పండగే! దీంతో కూర రుచి డబుల్!
మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు.. ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?
మేడారంలో బాలికపై అత్యాచారం ఆరోపణలు.. ఎంక్వైరీ టీం ఏం తేల్చిందంటే?
ఎండలో ఉన్నా విటమిన్ డి లోపం ఎందుకు వస్తోంది?
ఎండలో ఉన్నా విటమిన్ డి లోపం ఎందుకు వస్తోంది?
భారతదేశం రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కింది: ప్రధాని మోదీ
భారతదేశం రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కింది: ప్రధాని మోదీ
నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
నాకు అలవాటు ఉంది.. కానీ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తా.!
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' కి 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్త
భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్త
నెలసరి నొప్పికి ఎవ్వరూ చెప్పని చిట్కా.. పైనాపిల్‌తో దీన్ని కలపండి
నెలసరి నొప్పికి ఎవ్వరూ చెప్పని చిట్కా.. పైనాపిల్‌తో దీన్ని కలపండి
వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..?
వాతదోష నివారణకు బాబా రాందేవ్‌ ఇంటి చిట్కాలు విన్నారా..?