AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పుల్లటి తేన్పులు ఎందుకు వస్తాయి.? ఎలా చెక్‌ పెట్టాలి..

ఇటీవల జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పుల్లటి తేన్పులు వంటి సమస్యలు ఎక్కువుతున్నాయి. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది.? ఈ సమస్య నుంచి ఎందుకు బయటపడాలంటే పాటించాల్సిన నేచురల్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Health: పుల్లటి తేన్పులు ఎందుకు వస్తాయి.? ఎలా చెక్‌ పెట్టాలి..
Sour Belching
Narender Vaitla
|

Updated on: Oct 22, 2024 | 11:56 AM

Share

పుల్లటి తేన్పులు సర్వసాధారణంగా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. ఈ సమస్య కారణంగా వాంతులు కూడా అవుతుంటాయి. వినడానికి చిన్న సమస్యే అయినా, ఈ సమస్యతో బాధపడేవారు మాత్రం తీవ్ర సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇంతకీ పుల్లటి తేప్పులు ఎందుకు వస్తాయి.? ఎలాంటి చిట్కాల ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణ సంబంధిత సమస్యల కారణంగా పుల్లటి తేన్పులు వస్తాయి. త్వరగా జీర్ణంకాని ఆహారాన్ని తీసుకోవడం తేన్పులు ఎక్కువగా వస్తాయి. అలాగే కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ తాగడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల పుల్లటి తేన్పులు వేధిస్తాయని నిపుణులు అంటున్నారు. అన్నం తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగడం, తినగానే పడుకునే వారిలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.

పుల్లటి తేన్పుల వల్ల నోటి రుచి తగ్గిపోతుంది. అలాగే ఛాతీలో మంటకు దారి తీస్తుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేయడం వంటివి కూడా ఈ సమస్యకు దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు. గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా పుల్లటి తేన్పులకు ప్రధాన కారణమం.

ఈ సింపుల్ టిప్స్‌ పాటించండి..

పుల్లటి తేన్పులు రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే తీసుకునే ఫుడ్‌లో ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ప్రతీ రోజు కచ్చితంగా సోంపు గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. తీనివల్ల అపాన వాయువు, గ్యాస్‌ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.

పుదీనా టీ కూడా పుల్లని తేన్పులను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత పుదీనా టీ తాగితే ఈ సస్య దూరమవుతుంది. గుండెల్లో మంటను తగ్గించడంతో పాటు ఆమ్లత్వాన్ని తగ్గించడంలో పుదీనా టీ ఉపయోగపడుతుంది. ఇక ఉదయాన్ని జీలకర్ర నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. రాత్రంతా నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. గ్యాస్‌తో పాటు ఎసిడిటీ, పుల్లటి తేన్పులు వంటి సమస్యలన్నీ దూరమవుతాయి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..