Fridge Water : దాహం తీరట్లేదని ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. అయితే మీ గుండె జర భద్రం!
వేసవిలో మండిపోతున్న ఎండల కారణంగా చాలా మంది ఫ్రిజ్ వాటర్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే, ఎండాకాంలో ఎక్కువ మంది చల్లదనం కోసం లస్సీ, మజ్జిగ, జ్యూస్, కొబ్బరి నీళ్లు, మామిడి పన్నా మొదలైన శీతల పానీయాలు కూడా తాగుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగడం ముఖ్యం. అయితే, మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండేందుకు చల్లటి నీరు కాకుండా సాధారణ నీటిని మాత్రమే తాగటం మంచిదని సలహా ఇస్తున్నారు.

వేసవి కాలంలో దాదాపు అందరు ప్రజలు తమ దాహాన్ని తీర్చుకోవడానికి చల్లని నీళ్ళు తాగుతుంటారు.. చల్లని నీరు మాత్రమే శరీరం వేడికి, దాహం నుంచి ఉపశమనం ఇస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఎండలో బయటకు వెళ్లినప్పుడు, లేదంటే వ్యాయామం చేసిన తర్వాత లేదా ఆహారం తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా చల్లటి నీరు ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ నుండి తీసిన చల్లటి నీటిని పొరపాటున కూడా తాగకూడదని చెబుతున్నారు.
ఫ్రిజ్ లోంచి చల్లటి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?:
ఆయుర్వేదంలో చల్లని నీరు లేదా కూల్డ్రింక్లు జీర్ణక్రియను బలహీనపరుస్తాయని చెబుతున్నారు. జీర్ణక్రియను అగ్నిగా భావిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, నోటిలో ప్రారంభమై ప్రేగులలో ముగిసే జీర్ణక్రియ మొత్తం ప్రక్రియకు వేడి అవసరం. అలాంటి సమయంలో చల్లని పానీయాలు జీర్ణక్రియకు అడ్డంకిగా పనిచేస్తుంది. అలాగే, కొన్ని పరిశోధనల ప్రకారం చల్లటి నీరు రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేస్తుందని సూచిస్తున్నాయి. దీని కారణంగా జీర్ణ సమస్యలు మొదలవుతాయి.
చల్లని నీరు జీర్ణక్రియను మందగిస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. చల్లని నీరు గొంతులో మంటను కలిగిస్తుంది. జలుబు, దగ్గు, టాన్సిల్స్ వంటి సమస్యలు వస్తాయి. చల్లని నీరు గుండె వేగాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బులు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. చల్లని నీరు దంతాలను సున్నితంగా మారుస్తుంది. చిగుళ్ల నొప్పి, దంతాలు వదులుగా మారడం వంటి సమస్యలు వస్తాయి.
చల్లని నీరు రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చల్లని నీరు తలనొప్పి, సైనస్ సమస్యలను కలిగిస్తుంది. చల్లని నీరు జీర్ణక్రియను మందగించడం ద్వారా.. శరీరానికి పోషకాలు అందకుండా చేస్తుంది. వేడి నుండి చల్లని నీరు తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు వస్తాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. మట్టి కుండలోని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు తాగడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








