AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaratri 2022: శివరాత్రి రోజున ఈ ఆలయాలను దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం..

Shivaratri 2022: మహా శివరాత్రిని హిందువులు ( Maha Shivaratri 2022 ) ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. నేడు మహాశివరాత్రి పర్వదినం .. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు(Lord Shiva Temples)..

Shivaratri 2022: శివరాత్రి రోజున ఈ ఆలయాలను దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం..
Lord Shiva Temples In India
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 01, 2022 | 7:56 PM

Share

Shivaratri 2022: మహా శివరాత్రిని హిందువులు ( Maha Shivaratri 2022 ) ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. నేడు మహాశివరాత్రి పర్వదినం .. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు(Lord Shiva Temples) ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ రోజున శివభక్తులు శివయ్యను స్వామిని పూజించి ఉపవాసం ఉంటారు. శివపార్వతుల వివాహం జరిగిన రోజు మహాశివరాత్రిఅని భక్తుల నమ్మకం. ఈ రోజున దేశంలోని శైవ క్షేత్రాలతో పాటు, శివాలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంటుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధ, పురాతన శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి వంటి సందర్భాలలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆలయాలను సందర్శించవచ్చు. ఈ దేవాలయాలు మంచి ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. ఈ రోజు దేశంలోని ప్రసిద్ధ శివాలయ గురించి తెల్సుకుందాం..

శ్రీ సోమనాథ దేవాలయం: ఈ దేవాలయం గుజరాత్‌లో ఉంది. సోమనాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాల్లో  మొదటిదిగా పరిగణించబడుతుంది. మన దేశంలోని అనేక మంది ఆక్రమణదారులు, వివిధ పాలకులు ఈ ఆలయాన్ని  ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఆలయం మళ్లీ మళ్లీ పునర్నిర్మించబడింది. ఈ ఆలయం కపిల, సరస్వతి , జింక అనే 3 నదుల త్రివేణి సంగమం వద్ద ఉంది.

శివోహం శివాలయం:  కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న అతి పెద్ద..  ప్రసిద్ధ చెందిన శివాలయం. ఈ శివాలయం రోజులో 24గంటలు తెరచి ఉంటుంది. మహాశివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ 65 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంది. అందమైన శివుని విగ్రహం దర్శిస్తే.. మంచి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయ సమీపంలో మానవ నిర్మిత గుహలు కూడా ఉన్నాయి, ఇవి మొత్తం 12 జ్యోతిర్లింగాలు, చార్ ధామ్‌లు దర్శనం కోసం తయారు చేయబడ్డాయి. శివోహం శివాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భజనలు, లైట్ షోలు, హారతులతో పాటు ధ్యాన సమావేశాలు నిర్వహిస్తారు.

కాశీ విశ్వనాథ శివాలయం: కాశీ విశ్వనాథ శివాలయం పవిత్ర గంగా నది ఒడ్డున ఉంది. ఆక్రమణదారులచే అనేకసార్లు ధ్వంసమవ్వడంతో.. అనేక సార్లు ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఇక్కడకు ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు.

కేదార్నాథ్ ఆలయం: ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక ప్రత్యేకమైన అనుభవం.  ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ కేదార్‌నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని భక్తుల నమ్మకం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది ఎత్తైనది. ఆలయం లోపల, భక్తులు త్రిభుజాకార మంచుతో ఉన్న లింగాన్ని పూజిస్తారు.

Also Read:

ఇటువంటి వారు నిజంగా భూమి భారం.. ఎటువంటి ప్రయోజనం లేదంటున్న చాణక్య

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం