AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: ఈ సీజన్‌లో ఊటీ వెళ్తే ఉంటుంది.. మీకోసమే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. తిరుపతి నుంచి ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. 'అల్టీమేట్‌ ఊటీ ఎక్స్‌ తిరుపతి' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్‌ ప్యాకేజీ ఉండనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఈ టూర్‌ అందుబాటులో ఉండనుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో..

IRCTC: ఈ సీజన్‌లో ఊటీ వెళ్తే ఉంటుంది.. మీకోసమే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
IRCTC Ooty Package
Narender Vaitla
|

Updated on: Feb 03, 2024 | 6:08 PM

Share

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఊటీ. ఈ ప్రాంతానికి ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. తిరుపతి నుంచి ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. ‘అల్టీమేట్‌ ఊటీ ఎక్స్‌ తిరుపతి’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్‌ ప్యాకేజీ ఉండనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ఈ టూర్‌ అందుబాటులో ఉండనుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* టూర్‌లో భాగంగా మొదటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి 11.50 గంటలకు 17230 నెంబర్‌ ట్రైన్‌, బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

* రెండో రోజు ఉదయం 8.00 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఊటీకి చేరుకొని, హోటల్‌లో చెకిన్‌ అవుతారు. అనంతరం మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. ఊటీ లేక్ చూసిన తర్వాత రాత్రి ఊటీలో బస చేయాల్సి ఉంటుంది.

* మూడో రోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ పూర్తి చేయగానే.. దొడబెట్ట, టీ మ్యూజియం, పైకరా వాటర్ ఫాల్స్‌ సందర్శన ఉంటుంది. మూడడో రోజు రాత్రి కూడా ఊటీలోనే ఉంటారు.

* 4వ రోజు టిఫిన్‌ చేసిన తర్వాత.. కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉండాల్సి ఉంటుంది.

* ఇక 5వ రోజు హోటల్‌ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. అనంతరం సాయంత్రం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ 17229 రైలులో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

* చివరి రోజైన 6వ రోజు రాత్రి 12.05 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కి చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ఛార్జీలు ఇలా ఉంటాయి..

కంఫర్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌ ధర రూ. 26,770గా నిర్ణయించారు. ఇక డబుల్‌ షేరింగ్‌కు రూ. 15,880కాగా ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు టికెట్‌ ధర ఉంటుంది. టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ టూర్‌ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్‌ను చెక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు