AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. ఏం జరుగుతుందంటే

వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం...

Health: రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. ఏం జరుగుతుందంటే
Soaked Coriander
Narender Vaitla
|

Updated on: Jul 11, 2024 | 7:28 PM

Share

వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మీకు తెలుసా.? ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఎన్నో ప్రయజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రిండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.

* ధనియాల్లో విటమిన్‌ కె, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. జుట్టు రాలుడు సమస్య నుంచి బయటపడాలంటే ప్రతీ రోజూ ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

* డయాబెటిస్‌ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండేవారు ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

* ప్రతీరోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.

* వర్షాకాలం వచ్చే సీజనల్‌ వ్యాధులైన జలుబు ,దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ ధనియాల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

* కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు ధనియాల నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత