AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే షాక్‌ అవుతారు..!

సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంది చాలా ఎక్కువగా తింటూ ఉంటారు.. ముఖ్యంగా చికెన్‌, మటన్‌, చేపలు వంటి మాంసాహారం విషషయంలో ఇలాంటివి తరచూగా చూస్తుంటాం. అయితే, కడుపు నిండుగా తినడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. అలాంటి సమయాల్లో మీరు నిద్రపోతే, అది మీ జీర్ణ ప్రక్రియను మరింత ప్రభావితం చేస్తుంది. అంతేకాదు సరిగా నిద్రపోలేరు కూడా. రోజంతా నీరసంగా ఉంటారు. కాబట్టి, ఇదంతా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే షాక్‌ అవుతారు..!
Post Meal Habits
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2025 | 3:08 PM

Share

భోజనం తరువాత వేడినీళ్లు తాగడం, కొన్ని నిమిషాల పాటు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తరువాత వేడి నీళ్లు తాగటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. డైజెస్టివ్ ట్రాక్ట్ శుభ్రంగా మారుతుంది. హెల్దీగా ఉండొచ్చు. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి నీళ్లని తాగడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోతాయి. వేడి నీరు బాడీని క్లీన్ చేస్తుంది. వేడి నీళ్లు తీసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వేడి నీళ్లని తాగడంతో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నిత్యం రిలాక్స్‌గా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. నొప్పులు తగ్గుతాయి.

నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వేడినీళ్లని తీసుకోవడం వల్ల కండరాలు రిలాక్స్‌డ్‌గా మారుతాయి. బరువు కంట్రోల్‌లో ఉంచుకునేందుకు వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వేడి నీటిని తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది. వేడి నీళ్లు తీసుకోవడం వల్ల గొంతు ఫ్రీ అవుతుంది. వేడి నీరు తాగితే గొంతు సమస్యలు దూరం అవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వేడి నీళ్లు తాగితే చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ముడతలు తగ్గుతాయి.

ఒత్తిడి, యాంగ్జైటీని పోగొట్టడానికి వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రాత్రి నిద్ర పోయేటప్పుడు వేడినీరు తీసుకుంటే చాలా మంచిది. రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడానికి వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత వేడినీరు తాగేందుకు ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ తేలికవుతుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. వేడి నీళ్లు తాగడం అంటే చాలా వేడిగా తాగడం అని అనుకోకండి. గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి

వేడి నీళ్లే కాదు, తులసి, పుదీనా ఆకులు కలిపిన వేడి నీళ్ళు తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, మీరు తిన్న వెంటనే నిద్రపోకూడదు. ముఖ్యంగా అతిగా తిన్న తర్వాత అస్సలు పడుకోవద్దు. మీరు తిన్న ఆహారాలను జీర్ణం చేసుకోవడానికి మీ శరీరానికి కనీసం కొన్ని గంటలు సమయం ఇవ్వాలి. గరిష్టంగా తిన్నవెంటనే కాకుండా ఒక గంట తరువాత నిద్రపోవాలి. అప్పుడే మీకు మంచి రాత్రి నిద్ర వస్తుంది. దీంతో మధ్యాహ్నం సమయంలో సాఫీగా మీ పనులు చేసుకోగలుగుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..