AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

ఈ రోజుల్లో చాలా మంది శాకాహార భోజనాన్ని ఇష్టపడతారు. కానీ, మాంసాహార వంటకాలంత రుచిగా శాకాహార వంటకాలు ఉండవని వారు తరచుగా భావిస్తుంటారు. బిర్యానీ వంటి ఘాటైన, సువాసనగల వంటకం అందరికీ ఇష్టమైనది. పనస బిర్యానీ ఎంత రుచికరమైనదంటే, మాంసాహారులు సైతం ఆశ్చర్యపోతారు. పనసకాయ, ఆకృతి మాంసాన్ని పోలి ఉండటం వల్ల, ఈ బిర్యానీ నిజంగా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన వంటకం చేయాలనుకుంటే లేదా అతిథులను ఆకట్టుకోవాలనుకుంటే ఈ రెసిపీ సరైనది. కాబట్టి, ఇంట్లో పనస బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసి నేర్చుకుందాం..

వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్
Jackfruit Biryani Recipe
Jyothi Gadda
|

Updated on: May 13, 2026 | 1:00 PM

Share

బిర్యానీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ బిర్యానీ. అయితే శాకాహారుల కోసం మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని రుచితో ఉండే వంటకమే పనసకాయ బిర్యానీ (Kathal Biryani). పనసకాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటి ఆకృతి మాంసాన్ని పోలి ఉండటంతో దీనిని చాలామంది ఇష్టపడతారు. పనసకాయ బిర్యానీ శాకాహారులకు ఒక అద్భుతమైన వంటకం. దీని రుచి, ఆకృతి దాదాపు మాంసాహార బిర్యానీని పోలి ఉంటుంది. పనసకాయ బిర్యానీ తయారీ, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

పనసకాయ: అర కిలో (చిన్న ముక్కలుగా కోసినవి).

ఇవి కూడా చదవండి

బాస్మతీ బియ్యం: 2 కప్పులు (అరగంట ముందు నానబెట్టినవి).

మసాలాలు: పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, బిర్యానీ మసాలా, ఉప్పు.

సుగంధ ద్రవ్యాలు: బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా.

ఇతరాలు: ఉల్లిపాయ ముక్కలు (ఫ్రైడ్ ఆనియన్స్), పుదీనా, కొత్తిమీర, నెయ్యి లేదా నూనె.

తయారీ విధానం: ముందుగా పనసకాయ ముక్కలను ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో కొద్దిగా ఉడికించాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, బిర్యానీ మసాలా వేసి ఉడికించిన పనసకాయ ముక్కలను అందులో కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి.

మరో పక్క ఎసరు పెట్టి అందులో సుగంధ ద్రవ్యాలు వేసి బాస్మతీ బియ్యాన్ని 70 శాతం వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నూనె వేసి మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలను వేసి వేయించాలి. ఆ తర్వాత దానిపై ఉడికించిన అన్నాన్ని ఒక పొరలా వేయాలి. అన్నం పైన వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి మూత పెట్టి తక్కువ మంటపై 15-20 నిమిషాల పాటు దమ్ చేయాలి.

అంతే! ఎంతో రుచికరమైన పనసకాయ బిర్యానీ సిద్ధం. దీనిని రైతా లేదా మిర్చి కా సాలన్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది. పనసకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ సారి మీ ఇంట్లో విందు ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ప్రయత్నించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

Follow Us