AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ రోగులకు వరం ఈ పండు.. ఉదయాన్నే తింటే దెబ్బకు షుగర్ కంట్రోల్.. ఛూమంత్రం వేసినట్టే..

అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా, చాలా మంది మధుమేహం (డయాబెటిస్) బాధితులుగా మారుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. ప్రకృతి ప్రసాధించిన ఈ తియ్యని పండును తీసుకోవడం ద్వారా మీరు చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.. ఆ పండు ఏంటి..? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

డయాబెటిస్ రోగులకు వరం ఈ పండు.. ఉదయాన్నే తింటే దెబ్బకు షుగర్ కంట్రోల్.. ఛూమంత్రం వేసినట్టే..
Diabetes Care
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2025 | 3:17 PM

Share

బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయంతో పాటు డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నివారించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి.. అయితే.. సహజంగా చక్కెర స్థాయిని నియంత్రించడానికి మీరు జామపండు తినవచ్చంటున్నారు వైద్య నిపుణులు.. ఎన్నో పోషకాలు దాగున్న జామ పండును రెగ్యులర్ గా తీసుకుంటే.. పలు సమస్యలను నివారించవచ్చు.. అలాగే.. రక్తంలో అధిక చక్కెర స్థాయిని నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..

US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. జామకాయలో విటమిన్లు A, C, B6 అలాగే పొటాషియం, ఫోలిక్ ఆమ్లం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, ఇందులో లైకోపీన్ – యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం అందించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది

జామకాయను ప్రతిరోజూ తింటే శరీర రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, ఆయుర్వేదంలో నల్ల ఉప్పుతో తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుందని, మలబద్ధకం సమస్యను అధిగమించవచ్చని పేర్కొంటున్నారు. అయితే.. వయసు పెరిగే కొద్దీ, మధుమేహం.. అధిక రక్తపోటు అతిపెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఈ రెండు పరిస్థితులలోనూ జామకాయ ఉపయోగకరంగా ఉంటుంది. జామకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు, అయితే దానిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును సమతుల్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

జామ ఆకులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి..

ఆయుర్వేదంలో, జామ ఆకులను దివ్య ఔషధంగా భావిస్తారు. ఆకుల సారం లేదా కషాయాలను తీసుకోవడం వల్ల చిగుళ్ళలో రక్తస్రావం, నోటి పూతలు, మధుమేహం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. జామ ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని, ఇవి నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అనేక పరిశోధనలు కనుగొన్నాయి.

జామలో తగినంత మొత్తంలో విటమిన్ ఎ ఉండటం వల్ల, ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది కంటి చూపును కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కంటిశుక్లం వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

అయితే.. తియ్యగా ఉండే జామ పండును డయాబెటిస్ రోగులు అల్పాహారంలో తీసుకుంటే.. చాలా మంచిదని.. రోజంతా ఎనర్జీగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. జామ పండు జీర్ణ ససమ్యలను దూరం చేసి.. కడుపును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది..

ఇది కూడా చదవండి:

పురుషులకు అలర్ట్.. 40 ఏళ్ల తర్వాత ఈ 3 పరీక్షలు చేయించుకోండి.. ఆ తర్వాత ఎంజాయ్ చేయొచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..