
డయాబెటిస్
ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.
మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.
మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి పిచ్చి ఆకులు కాదు.. పవర్ఫుల్.. దెబ్బకు డయాబెటిస్తోపాటు ఈ రోగాలన్నీ పరార్..
అందరూ ఇష్టపడి తినగలిగే పండ్లలో జామ పండు ఒకటి.. అయితే.. పండు లానే.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. జామఆకులలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులను నమలి తినొచ్చు.. లేదా వాటి రసాన్ని తీసి తాగవచ్చు.. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కావున జామ ఆకు రసం తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 23, 2025
- 5:58 pm
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఆ పండ్ల జ్యూస్లు అస్సలు తాగొద్దు.. ఎందుకంటే..
ఈ రోజుల్లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. డయాబెటిస్ రోగులు ముఖ్యంగా తాము తినే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. తద్వారా వారు చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించగలరు.. ఈ రోజుల్లో చాలా మంది జ్యూస్లు తాగడానికి ఇష్టపడతారు. డయాబెటిస్ ఉన్న రోగులు అన్ని పండ్ల రసాలను తాగొచ్చా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 20, 2025
- 1:59 pm
ఈ 5 డ్రింక్స్ అమృతంతో బరాబర్.. ఉదయాన్నే తాగితే డయాబెటిస్కు ఛూమంత్రం వేసినట్లే..
డయాబెటిస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కోట్లాది మంది మధుమేహం బారిన పడ్డారు.. అయితే.. డయాబెటిస్ ఒక ప్రాణాంతక వ్యాధి కంటే తక్కువ కాదని.. ఈ వ్యాధిలో రోగి నెమ్మదిగా మరణానికి చేరువవుతాడని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ ప్రక్రియను నెమ్మదింపజేయడానికి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
- Shaik Madar Saheb
- Updated on: Feb 16, 2025
- 3:46 pm
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. ముందుగానే ఇలా చేస్తే మహమ్మారికి చెక్ పెట్టొచ్చంట..
మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీ-డయాబెటిస్ గా పేర్కొంటారు.. అయితే, మీ ఆహారం అలవాట్లను మార్చుకోవడం ద్వారా, అది డయాబెటిస్గా మారకుండా నిరోధించవచ్చు. ఆహారంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి.. ఏ విషయాలను గుర్తుంచుకోవాలి..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 13, 2025
- 5:47 pm
ఓర్నాయనో.. డయాబెటిస్ రోగులకు అలర్ట్.. బంగాళాదుంపలు తింటే ఏమవుతుందో తెలుసా..?
డయాబెటిస్ రోగులు బంగాళాదుంపలు తినాలా.. వద్దా..? అని అయోమయంలో ఉంటారు.. ఎందుకంటే బంగాళాదుంపలు కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. దీనివల్ల చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, చక్కెర రోగులు బంగాళాదుంపలు తినడం పూర్తిగా మానేయాలా..? లేక ఎలా తినాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 9, 2025
- 12:36 pm
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. రాత్రిపూట భోజనం మానేయడం మంచిదేనా..? అలా చేస్తే షుగర్ లెవల్స్ తగ్గిపోతాయా..
డయాబెటిస్ రోగులు రాత్రి భోజనం చేయాలా వద్దా..? చేస్తే ఏమవుతుంది..? షుగర్ లెవల్స్ పెరుగుతాయా..? దీని గురించి తరచుగా గందరగోళం ఉంటుంది. అయితే.. కొంతమంది రాత్రి భోజనం చేయకూడదని అంటారు.. మరికొందరు డయాబెటిక్ రోగులు భోజనం దాటవేయకూడదని.. తినకుండా అస్సలు ఉండకూడదని అంటున్నారు. దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Feb 5, 2025
- 8:11 pm
రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుందా..? వామ్మో.. ఎంత డేంజరో తెలుసా..
ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారుతుంది.. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ఉద్యోగ యువత జీవనశైలి ఇలాగే మారిపోతుంది.. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అనేది.. ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 4, 2025
- 3:03 pm
ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. పవర్ఫుల్ దివ్యౌషధం.. ఆ సమస్యలను మడతపెట్టేస్తుంది..
కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్లా తింటుంటారు. కీర దోస తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు.. గుండెజబ్బుల సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 15, 2025
- 3:36 pm
డయాబెటిస్కు ఛూమంత్రం.. బ్లడ్ షుగర్ నార్మల్గా ఉండాలంటే ఇవి తినండి చాలు..!
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా పెరుగుతోంది.. దీనిలో రోగుల రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి, మెరుగైన ఫలితాలను ఇవ్వగల అటువంటి ఆహారాన్ని తీసుకోవడం అవసరం అని అధ్యయనంలో వెల్లడించింది.
- Shaik Madar Saheb
- Updated on: Jan 14, 2025
- 3:39 pm
ఈ ఆకులను చీప్గా చూడకండి.. పవర్ఫుల్.. డైలీ నాలుగు తిన్నారంటే దెబ్బకు ఈ రోగాలన్నీ పరార్..
మన పెరట్లో దొరికే ఆకులతో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అలాంటి వాటిలో తులసి ఒకటి.. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వాస్తవానికి, హిందూ మతంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిని లక్ష్మీ దేవి అవతారంగా భావిస్తారు.. అందుకే.. తులసి మొక్క పూజతోనే రోజును ఆరంభిస్తుంటారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 12, 2025
- 4:37 pm