
డయాబెటిస్
ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.
మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.
మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నీరు అమృతం కన్నా పవర్ఫుల్.. రోజూ ఓ గ్లాస్ తాగితే ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రమే.. దెబ్బకు పరార్
బార్లీలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. బార్లీని గరిబోళ్ల సంజీవని అంటారు.. ఆయుర్వేదంలో దీనిని అద్భుతమైన ఔషధంగా పేర్కొంటారు.. బార్లీ ఆరోగ్యానికి చాలామంచిది.. ఇది శరీరానికి ఎన్నో పోషకాలు అందించడంతోపాటు.. చల్లగా ఉంచుతుంది. బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 21, 2025
- 4:16 pm
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలంలో వీటికి దూరంగా ఉండటమే బెటర్.. లేకపోతే..
భారతదేశంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధిని నియంత్రించడానికి, ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. డయాబెటిస్ రోగులు వేసవిలో కొన్ని రకాల ఆహారాలు తినకూడదని.. వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో మధుమేహ రోగులు ఏమి తినకూడదు..? నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 21, 2025
- 3:35 pm
డయాబెటిస్ రోగులకు స్వీట్ న్యూస్.. ఇకపై వీటిని తింటూ ఆ కోరికను తీర్చుకోవచ్చట..
నాకు డయాబెటిస్ ఉంది.. స్వీట్లు తినాలనిపిస్తుంది.. ఏం చేయాలి.. అంటూ చాలామంది మధుమేహం రోగులు పేర్కొంటుంటారు.. అయితే.. అటువంటి పరిస్థితిలో చక్కెర రోగులు ఏమి తినాలి? వైద్యులు డయాబెటిస్ రోగులు చక్కెర, దానితో తయారు చేసిన ఆహార ఉత్పత్తులను తినకుండా నిషేధిస్తారు. అటువంటి పరిస్థితిలో, షుగర్ రోగులు ఈ విధంగా స్వీట్ల కోరికను తీర్చుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.. చక్కెర స్థాయిని పెద్దగా ప్రభావితం చేయని తీపి పదార్థాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 20, 2025
- 12:39 pm
వేసవిలో కూడా తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారా..? వామ్మో.. ఆ సమస్యలు మొదలైనట్లే..!
వేసవిలో తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల యూటీఐ, మూత్రపిండాల సమస్యలు, మూత్రాశయ సమస్యలు, నిర్జలీకరణం (డీహైడ్రేషన్) కూడా సంభవించవచ్చు. సాధారణంగా వేసవిలో నీరు ఎక్కువగా వినియోగిస్తారు. అందుకే మనం ఎక్కువ నీరు తాగడం వల్ల ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నామని అనుకుంటాము. కానీ, వేసవిలో తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేక తీవ్రమైన వ్యాధులను సూచిస్తుంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 12, 2025
- 9:55 am
ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. డయాబెటిస్కు పవర్ఫుల్ దివ్యౌషధం.. గుట్ట లాంటి పొట్ట కూడా మటాషే..!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిస్) చాలా ప్రమాదకరంగా మారుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే, అది ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 5, 2025
- 7:55 pm
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఇలా చేస్తే దెబ్బకు షుగర్ కంట్రోల్..
డయాబెటిస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఎప్పటికీ తగ్గని వ్యాధి. దీనిని నియంత్రించడం మాత్రమే సాధ్యమవుతుంది. డయాబెటిస్లో చక్కెర స్థాయి పెరగడం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు.. అందుకే.. చక్కెర స్థాయిని నియంత్రించడానికి కొన్ని చిట్కాలను అనుసరించడం.. ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యమని.. వైద్య నిపుణులు చెబుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 5, 2025
- 4:03 pm
గుట్టలాంటి పొట్టకు పవర్ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే షుగర్ కూడా మటాషే..
ప్రతి పది మందిలో దాదాపు ఐదారుగురు.. అధిక బరువు, హైపర్టెన్షన్, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే.. వీటినుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు..
- Shaik Madar Saheb
- Updated on: Mar 24, 2025
- 11:12 am
ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీకు డయాబెటిస్ వచ్చినట్లే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు.. అయితే.. దేశంలో 10 కోట్లకు పైగా డయాబెటిస్ బాధితులు ఉన్నారని.. పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. అయితే.. డయాబెటిస్ విషయంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే దాని లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి.
- Shaik Madar Saheb
- Updated on: Mar 22, 2025
- 1:03 pm
యూత్కు బిగ్ అలర్ట్.. ఇలాంటి తప్పులు చేస్తే షుగర్ పక్కా అంట.. కంట్రోల్ చేసేందుకు బెస్ట్ టిప్స్ ఇవే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. చక్కెర స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుంది.. దానిని ఎలా నియంత్రించవచ్చు? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ వివరాలను కథనంలో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Mar 17, 2025
- 1:47 pm
ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. డయాబెటిస్కు బ్రహ్మస్త్రం.. దెబ్బకు షుగర్ కంట్రోల్..
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం చాలామంచిది.. దీనికోసం జీవనశైలి, ఆహారంలో మార్పులు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అలాంటి మంచి ఆహారంలో మెంతులు, మెంతి కూర ఒకటి.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి..
- Shaik Madar Saheb
- Updated on: Mar 16, 2025
- 11:35 am