డయాబెటిస్

డయాబెటిస్

ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.

మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.

మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి

Diabetes: డయాబెటిస్‌ రోగులకు దివ్యాస్త్రం ఈ పండు.. ఇలా తీసుకుంటే మహమ్మారికి చెక్ పెట్టినట్లే..

భారతదేశంలో మధుమేహం కేసులు నానాటికి పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా పేలవమైన జీవనశైలి, అనారోగ్యరమైన ఆహారం వల్ల డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

తీవ్రమైన ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్.. వెంటనే ఇలా చేయండి..

ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఉంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఎండ వేడిమికి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత, సూర్యకాంతి కారణంగా హీట్ స్ట్రోక్ సమస్య వస్తుంది.. అయితే.. కొందరికి వేడి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు..

Health: మీకు షుగర్ ఉందా..? అయితే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడ్డట్లే…

ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయకపోతే, అది అనేక హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం వంటి ఇతర సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. కాబట్టి, మీకు కూడా డయాబెటిస్ సమస్య ఉంటే, మీ గుండె ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.

Barley Water: అమృతమే ఈ నీరు.. రోజూ ఒక గ్లాసు తాగారంటే ఈ సమస్యలకు దివ్యౌషధం.. వడదెబ్బ ప్రమాదమే ఉండదు..

సూరీడు ఏమాత్రం తగ్గడం లేదు.. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మే నెల రాక ముందే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈక్రమంలో చాలా మంది డీ హైడ్రేషన్ తో వడదెబ్బ బారిన పడుతున్నారు. వేసవి తాపం కారణంగా ఎన్ని మంచినీళ్లు తాగినా దాహం తీరదు..

Diabetes: డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? బ్లడ్ షుగర్ అమాంతం పెరుగుతుందా..

మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు తినకూడదన్న విషయం అందరికీ తెలుసు.. ఎందుకంటే ఇవి చక్కెర స్థాయిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిస్‌లో చాలా పండ్లు తినడం కూడా నిషేధం.. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది.. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కొన్ని పండ్లు సహాయపడతాయి.

పచ్చగా ఉన్నాయ్.. ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రోజూ ఒక్కటి తింటే ఆ సమస్యలకు మడతబెట్టినట్లే..

ఎన్నో ఔషధ గుణాలు దాగున్న సుగంధ ద్రవ్యాలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. అలాంటి వాటిల్లో ఏలకులు ఒకటి.. ఏలకుల వాసన ఎంతో పరిమళంగా ఉంటుంది. ఏలకులు ప్రతి ఇంట్లో సులభంగా దొరుకుతాయి.

ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే ఓం బీమ్ బుష్ అంతే..

బొప్పాయి.. ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పండు.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, పాపైన్, ఫైబర్ వంటి మూలకాలు ఇందులో ఉంటాయి. బొప్పాయి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. మీరు బొప్పాయిని మీ ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు.

Apple – Diabetes: యాపిలా మజాకా.. డయాబెటిస్ రోగులు రోజూ ఒకటి తింటే ఏమవుతుందో తెలుసా..?

రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని పేర్కొంటుంటారు.. ఈ మాట ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం.. వైద్యులు కూడా తరచూ ఇలాంటి విషయాన్నే చెబుతుంటారు. అయితే, నిజంగానే యాపిల్స్ తినడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు.

గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. లవంగంతో ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుందట.. ట్రై చేయండి..

ఊబకాయం అనేది శరీరంలోని వివిధ ప్రదేశాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడంతో సంభవించే తీవ్రమైన పరిస్థితి. వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. స్థూలకాయం జన్యుపరమైన వైద్య పరిస్థితుల ఫలితంగా వచ్చేది మాత్రమే కాదు, చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా వచ్చేది..

డయాబెటిస్ బాధితులకు అలర్ట్.. రాత్రిపూట ఇలా చేస్తే షుగర్‌కు కళ్లెం వేసినట్లే..

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత కాలంలో చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధికి కారణం దుర్భురమైన జీవనశైలి.. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర స్థాయిని పెంచడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ప్రస్తుతం, ఈ వ్యాధిని ఆహారం, వ్యాయామం ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు.

Fenugreek Seeds Side Effects: ఈ ఐదుగురు మెంతులకు దూరంగా ఉండాలి.. లేకుంటే ప్రమాదమే..!

Fenugreek Seeds Side Effects: అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి, అద్భుతమైన ప్రయోజనాలను పొందడానికి మెంతి గింజలను తీసుకుంటారు. మెంతి గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఆహారం రుచిని పెంచేందుకు ఈ గింజలను రకరకాలుగా ఉపయోగిస్తాం. మెంతి గింజలను సాధారణంగా ఔషధంగా లేదా ఆహారంతో తీసుకుంటారు..

అమ్మాయిలు, అబ్బాయిలూ తస్మాత్ జాగ్రత్త.. యువతను బలిపశువుల్లా మారుస్తున్న ఈ 3 ప్రమాదకర వ్యాధులు..

ఈరోజుల్లో ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల చాలా మంది యువత తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ బిజీ లైఫ్‌లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యంపై తీవ్రమైన విధంగా చెడు ప్రభావం చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మూడు ప్రమాదకరమైన వ్యాధుల బాధితులుగా మారుతున్నారు.

మీ చేతుల్లోనే ఆరోగ్యం.. తేనె ఎప్పుడు తినాలో తెలుసా..? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదంట..

ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తెగ కష్టపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఉదయం వేళ జాగింగ్ చేయడం.. జిమ్‌కు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. అంతేకాకుండా.. వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. తేనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

వామ్మో.. తిన్న వెంటనే నిద్రపోతున్నారా..? అయితే, మీకు ఈ ప్రమాదకర సమస్యలు చుట్టుముట్టినట్లే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా.. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో మిమ్మల్ని మీరు చూసుకోవడం చాలా కష్టమైన పనిగా మారింది. ఆధునిక జీవనశైలిని అనుసరించడం.. ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిలో నిమగ్నమై ఉండటంతో ఆరోగ్యంపై పెద్దగా దృష్టిసారించరు.. దీని కారణంగా వారు తమ ఆహారం, పానీయాలపై శ్రద్ధ చూపరు.

డయాబెటిస్‌కు చెక్ పెట్టే ఛూమంత్రం ఇదే.. ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకుంటే ఊహించని రిజల్ట్..

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలో కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే, డయాబెటిస్‌తో జీవించడం ఏ వ్యక్తికి అంత సులభం కాదు.. ఈ సమయంలో ఆహారం, పానీయాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. ఏమి తినాలి..? ఏమి తినకూడదు..? అనే పూర్తి జాబితాపై అవగాహనతో ఉండాలి.