AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్

డయాబెటిస్

ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.

మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.

మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి

డయాబెటిస్‌కు అదిరిపోయే ఛూమంత్రం.. ఈ ఆకును నమిలి తింటే దెబ్బకు షుగర్ కంట్రోల్..

అనేక పోషక విలువలు కలిగిన కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయి.. ఇందులో రాగి, కాల్షియం, భాస్వరం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లు, అమైనో ఆమ్లాలు కూడా ఇందులో ఉన్నాయి.

కోల్డ్ వెదర్‌లో సైలెంట్ కిల్లర్ ముప్పు.. ఈ ట్రిక్‌తో షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చట..

శీతాకాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి దీనిని విస్మరించకూడదు. కాబట్టి, శీతాకాలంలో డయాబెటిస్ పేషంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా అదుపులో ఉంచుకోవాలి..? ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? డాక్టర్ సుభాష్ గిరి ఏం చెబుతున్నారు.. లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

అలర్ట్.. ఇవన్నీ డయాబెటిస్ లక్షణాలే.. లేటయ్యే కొద్ది పెను ప్రమాదమట..

ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ఈ రోజు మధుమేహం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ప్రజలు తరచుగా డయాబెటిస్ ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోరు. కాబట్టి, మధుమేహం వివరాలను అన్వేషిద్దాం. ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ఎండోక్రినాలజీ - జీవక్రియ విభాగం HOD ప్రొఫెసర్ డాక్టర్ నిఖిల్ టాండన్‌ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

కటిక చేదుగా ఉంటుందని భయపడొద్దు.. అన్ని రోగాలకు సర్వరోగనివారిణి..

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ బొప్పాయి ఆకులు కూడా అంతే మేలు చేస్తాయని మీకు తెలుసా? బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది అనేక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

శీతాకాలం మొదలైంది మావ.. రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

శీతాకాలంలో కొంతమందికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం సహజం.. ఇది సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల కావచ్చు. అయితే.. డయాబెటిక్ రోగులు ఎలాంటి దినచర్యను అనుసరించాలో తెలుసుకోవడం ముఖ్యం.. ఇప్పుడు శీతాకాలం సమీపిస్తున్నందున, ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి.. ఇలాంటి తరుణంలో జాగ్రత్త ఉండటం ముఖ్యమని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

శీతాకాలం ప్రారంభమైంది.. రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి.. ఎందుకంటే..

కొంతమందిలో చలికాలంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం కావచ్చు. శీతాకాలంలో మీ చక్కెర స్థాయిలను ఎలా తగ్గించుకోవాలి..? షుగర్ పేషెంట్లు ఎలాంటి దినచర్యను అవలంభించాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి..

చక్కెర ఎక్కువగా తింటున్నారా.. ఆ డేంజర్ వ్యాధి బారిన పడటం ఖాయం.. నమ్మలేని చేదు నిజం ఇదిగో..

ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయని, జ్ఞాపకశక్తి తగ్గుతుందని, అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. చక్కెర తీసుకోవడం తగ్గించడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని.. దీంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. దీనిని నివారించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏ విధంగా జీవనశైలిని మార్చుకోవాలి అనే వివరాలను తెలుసుకోండి..

ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటున్నారా..? డయాబెటిస్ రోగులకు యమ డేంజర్..

మీరు నిరంతరం ఎయిర్ కండిషన్డ్ (AC) ప్రాంతంలో కూర్చుంటే లేదా రోజుకు 8 నుండి 10 గంటలు ఎయిర్ కండిషనర్ ముందు గడుపుతుంటే జాగ్రత్తగా ఉండండి. అధిక ఎయిర్ కండిషనింగ్ మీ చక్కెర స్థాయిలను దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏసీ వల్ల ఇలా ఎలా జరుగుతుంది..? ఎందుకు జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకోండి..

డయాబెటిస్ రోగులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? ఓర్నాయనో పెద్ద కథే ఉందిగా..

కొబ్బరి నీరు ప్రకృతి ప్రసాదించిన వరం.. దీనిని ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. కొబ్బరి నీరు రుచికరంగా ఉండటంతోపాటు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇది పూర్తిగా సహజమైన, తేలికైన, తక్కువ కేలరీల పానీయం.. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.

ఈ ఆకులు ఏం చేస్తాయిలే అనుకునేరు.. డయాబెటిస్‌కు పవర్‌ఫుల్ ఛూమంత్రం..

వాతావరణ మార్పులతో డయాబెటిక్ రోగుల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. డయాబెటిక్ రోగులు కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి.. మందులు తీసుకున్న తర్వాత కూడా ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడం కష్టం.

మీలో ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ బారిన పడ్డట్లే.. లైట్ తీసుకుంటే లైఫే డేంజర్..

దేశంలో అలాగే.. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 830 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ జీవనశైలి వ్యాధిని సకాలంలో నియంత్రించకపోతే, ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.

ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆ సమస్యలకు పవర్‌ఫుల్ బ్రహ్మాస్త్రం.. దెబ్బకు రివర్స్ అవ్వాల్సిందే

కరివేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల అనేక అనారోగ్యాలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని బలోపేతం చేస్తుంది. అవి మానసిక అనారోగ్యాలతో పాటు క్యాన్సర్, డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని పలు అధ్యయనాల్లోనిరూపితమైంది.