Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్

డయాబెటిస్

ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.

మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.

మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే షుగర్ కూడా మటాషే..

ప్రతి పది మందిలో దాదాపు ఐదారుగురు.. అధిక బరువు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే.. వీటినుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు..

ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీకు డయాబెటిస్ వచ్చినట్లే..

భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు.. అయితే.. దేశంలో 10 కోట్లకు పైగా డయాబెటిస్ బాధితులు ఉన్నారని.. పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. అయితే.. డయాబెటిస్ విషయంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే దాని లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి.

యూత్‌కు బిగ్ అలర్ట్.. ఇలాంటి తప్పులు చేస్తే షుగర్ పక్కా అంట.. కంట్రోల్ చేసేందుకు బెస్ట్ టిప్స్ ఇవే..

భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. చక్కెర స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. చక్కెర స్థాయి ఎందుకు పెరుగుతుంది.. దానిని ఎలా నియంత్రించవచ్చు? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ వివరాలను కథనంలో తెలుసుకోండి..

ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. డయాబెటిస్‌కు బ్రహ్మస్త్రం.. దెబ్బకు షుగర్ కంట్రోల్..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం చాలామంచిది.. దీనికోసం జీవనశైలి, ఆహారంలో మార్పులు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అలాంటి మంచి ఆహారంలో మెంతులు, మెంతి కూర ఒకటి.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి..

బంగాళాదుంప మంచిదే కానీ.. ఈ రెండు సమస్యలున్న వారు తింటే దుంపతెంచుతుంది..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కూరగాయలలో బంగాళాదుంపలు ఒకటి.. ఇది దాదాపు ప్రతి వంటగదిలో లభించే ముఖ్యమైన ఆహార పదార్థం. ఉత్తరాదిలో అయినా, దక్షిణాదిలో అయినా, బంగాళాదుంపలకు ఎంతో ప్రత్యేకత ఉంది.. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు.

ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. సిక్రెట్ తెలిస్తే జింగ్ జింగ్ అమేంజింగ్ అంతే.. అస్సలు వదిలిపెట్టరు

లవంగాలను శతాబ్దాలుగా భారతీయ, ఆసియా వంటకాల్లో ఉపయోగిస్తున్నారు.. వాటి రుచి, వాసన, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. అయితే.. లవంగాలు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి.. అనేక రకాల శరీర సమస్యలను నయం చేయడానికి ఆయుర్వేదంలో లవంగాల ప్రస్తావన ఉంది.. దీనిని శక్తివంతమైన ఔషధంగా పేర్కొంటారు.

జస్ట్ కూరగాయేగా అనుకునేరు.. దీని జ్యూస్ అమృతం కన్నా పవర్‌ఫుల్.. దెబ్బకు షుగర్ కంట్రోల్..

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు.. అయితే.. డయాబెటిస్ చాలా సంక్లిష్టమైన వ్యాధి.. ఒకసారి దాని బారిన పడితే.. జీవితాంతం అతన్ని వదిలి పెట్టదు.. ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది.. అయినప్పటకీ..

నల్లగా ఉందని తీసిపారేయకండి.. అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఆ సమస్యలకు దివ్యౌషధం..

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.. ఇది మన శతాబ్దాల నాటి భారతీయ వైద్య విధానం - ఆయుర్వేదంలో దీని గురించి ఎక్కువగానే ప్రస్తావించారు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పసుపును ఆహార పదార్థంగా, సౌందర్య సాధనంగా, ఔషధంగా ఉపయోగిస్తారు.

నడక తర్వాత ఈ 4 లక్షణాలు కనిపిస్తే వెరీ డేంజర్.. డయాబెటిస్‌కు చేరువైనట్లే..

వాస్తవానికి.. నడక అనేది ఒక సహజమైన చర్య.. ఎల్లప్పుడూ మనం నడుస్తూనే ఉంటాం.. అయితే.. నడుస్తున్నప్పుడు మీకు ఏదైనా భిన్నంగా లేదా అసౌకర్యంగా అనిపిస్తే, అది మధుమేహం ముందస్తు హెచ్చరిక సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి రక్తంలో చక్కెర స్థాయిలు, రక్త ప్రసరణ, నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఈ 5 వ్యాధులు యమడేంజర్.. కంటి చూపు ఖతమేనట.. అవేంటో మీకు తెలుసా

చాలా మంది పుట్టుకతోనే అంధత్వానికి గురవుతుండగా, మరికొంతమంది తమ ఆరోగ్య సంబంధిత సమస్యలను విస్మరించడం వల్ల కంటి చూపును కోల్పోతున్నారు. సరిగ్గా నిర్వహించకపోతే, కంటి చూపు తగ్గుతుంది.. అలాగే.. తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. అశ్రద్ధ చేయడం వల్ల కంటిచూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఏర్పడుతుంది.