AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్

డయాబెటిస్

ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.

మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.

మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి

ఈ లక్షణాలు డేంజర్.. న్యాచురల్ టిప్స్‌తో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు.. ఎవ్వరికీ తెలియని రహస్యమిదే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, భారతదేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటిస్‌తో ప్రభావితమవుతున్నారు.. భవిష్యత్తులో ఈ సంఖ్య నాలుగుకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, డయాబెటిస్‌పై పూర్తి అవగాహనతో ఉండటం చాలా మంచిది.

షుగర్‌ను కంట్రోల్ చేసే పవర్‌ఫుల్ ఛూమంత్రం.. వీటిని తీసుకుంటే డయాబెటిస్ దరిదాపుల్లో కూడా ఉండదు..

నేటి జీవనశైలిలో మధుమేహం ఒక సాధారణ సమస్యగా మారింది. దీనిని నియంత్రించడానికి అనేక సహజ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతులలో భాగంగా కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల షుగర్ స్థాయిలను సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

స్వీట్ తిన్న 30 నిమిషాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. యమడేంజర్..

తీపి పదార్థాలు తిన్న కొద్ది నిమిషాల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఇన్సులిన్ స్రావం అధికమవడం వంటి మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు మీకు మధుమేహం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..

ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురవుతున్న పలు అనారోగ్య సమస్యలకు కాకరకాయ రసం ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. ముఖ్యంగా మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచుపదార్థం అధికంగా ఉండటం వలన ఇది బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

పిచ్చి తీగ అనుకునేరు.. పవర్‌ఫుల్.. ఉదయాన్నే కొంచెం తాగితే ఈ సమస్యలన్నీ పరార్..

తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తిప్పతీగ జ్యూస్ చేదుగా ఉండవచ్చు, కానీ ఇది సర్వరోగనివారిణి.. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆయుర్వేద మూలిక. ఇది దీర్ఘకాలిక జ్వరాలు, మధుమేహం, చర్మ సమస్యలు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఇంకా పలు సమస్యల నివారణలో సహాయపడుతుంది.

వారెవ్వా.. ఒక్క పండుతో డయాబెటిస్ కంట్రోల్.. లాభాలు తెలిస్తే అవాక్కే..

ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో.. మధుమేహం (డయాబెటిస్) కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్నవారైనా, పెద్దవారైనా, అందరూ మధుమేహంతో బాధపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి చర్యలు తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అలాంటి వారికి బొప్పాయి పండు అద్భుతంగా సహాయపడుతుంది.

ఆకలి.. ఆకలి.. ఆకలి.. అయ్యబాబోయ్.. ఇది డయాబెటిస్ ప్రారంభ సంకేతమేనా..

భోజనం చేసిన మూడు నుండి నాలుగు గంటల తర్వాత ఆకలిగా అనిపించడం సాధారణమే.. కానీ తిన్న కొన్ని గంటల్లోనే మళ్ళీ ఆకలిగా అనిపించడం.. తరచూగా ఏదైనా తినాలనిపించడం.. అనేది సాధారణమా లేక డయాబెటిస్ వంటి వ్యాధికి సంకేతమా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

షుగర్ ఉన్న వారికి ఇది విషంతో సమానం.. మటన్, చికెన్, చేపల్లో ఏది బెస్ట్ అంటే..

షుగర్ ఉన్నవారు నాన్-వెజ్ ఆహారం తీసుకోవడంపై చాలామందిలో సందేహాలున్నాయి. చికెన్, మటన్, చేపలు తింటే.. షుగర్ పెరుగుతుందేమో.. ఇంకా తింటే ఎలా తినాలి..? ఎంత మోతాదులో తినాలి..? సందేహాలు కలుగుతుంటాయి.. అయితే.. డయాబెటిస్ రోగులు మటన్, ప్రత్యేకించి తలకాయ కూర వంటి రెడ్ మీట్‌ను పూర్తిగా నివారించాలని డైటీషియన్లు చెబుతున్నారు. వీటిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణకు రావడం కష్టం.

డయాబెటిస్‌‌ ఇబ్బంది పెడుతోందా..? నోటెన్షన్.. జస్ట్ ఈ నీటితో చెక్ పెట్టేయండి..

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు మందులు, ఆహారంతో వారి రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అంతేకాకుండా కొన్ని చిట్కాలతో కూడా షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.. అవేంటో తెలుసుకుందాం..

ఎవ్వరికీ తెలియని అద్భుతమైన ఔషధ రహస్యం.. ఉదయాన్నే ఒక్క గ్లాసు తాగండి చాలు..

మెంతులు మన వంటింటి దినుసులలో దాగున్న అద్భుత ఔషధం. ఇవి ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి, తల్లిపాలు పెంచడానికి, ప్రసవాన్ని సులభతరం చేయడానికి ఉపకరిస్తాయి. అధిక కొలెస్ట్రాల్, మధుమేహం నియంత్రణకు, మలబద్ధకం, జ్వరం, గొంతునొప్పి నుండి ఉపశమనం పొందడానికి మెంతులు ఎంతగానో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో మెంతులను చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఇదీ తులసి రహస్యం.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం.. ఉదయాన్నే రెండు ఆకులు చాలు..

తులసి మొక్క.. దాని ఆకులు, కాండం, వేరు భాగాలతో సహా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక వరం. తులసి ఒక అడాప్టోజెన్ వలె పనిచేస్తుంది. ఇది శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా మార్చుకోవడానికి.. మానసిక సమతుల్యతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

చేదుగా ఉంటుంది కానీ.. ఈ 2 రోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే అరకప్పు తాగితే..

ప్రపంచవ్యాప్తంగా.. డయాబెటిస్, యూరిక్ యాసిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి... ముఖ్యంగా మన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు యూరిక్ యాసిడ్, డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, ఈ కూరగాయ రసాన్ని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా.. వాటిని అదుపులో ఉంచుకోవచ్చు..

ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ