AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్

డయాబెటిస్

ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్‌లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.

మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.

మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి

షుగర్ ఉన్న వారికి ఇది విషంతో సమానం.. మటన్, చికెన్, చేపల్లో ఏది బెస్ట్ అంటే..

షుగర్ ఉన్నవారు నాన్-వెజ్ ఆహారం తీసుకోవడంపై చాలామందిలో సందేహాలున్నాయి. చికెన్, మటన్, చేపలు తింటే.. షుగర్ పెరుగుతుందేమో.. ఇంకా తింటే ఎలా తినాలి..? ఎంత మోతాదులో తినాలి..? సందేహాలు కలుగుతుంటాయి.. అయితే.. డయాబెటిస్ రోగులు మటన్, ప్రత్యేకించి తలకాయ కూర వంటి రెడ్ మీట్‌ను పూర్తిగా నివారించాలని డైటీషియన్లు చెబుతున్నారు. వీటిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణకు రావడం కష్టం.

డయాబెటిస్‌‌ ఇబ్బంది పెడుతోందా..? నోటెన్షన్.. జస్ట్ ఈ నీటితో చెక్ పెట్టేయండి..

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు మందులు, ఆహారంతో వారి రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అంతేకాకుండా కొన్ని చిట్కాలతో కూడా షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.. అవేంటో తెలుసుకుందాం..

ఎవ్వరికీ తెలియని అద్భుతమైన ఔషధ రహస్యం.. ఉదయాన్నే ఒక్క గ్లాసు తాగండి చాలు..

మెంతులు మన వంటింటి దినుసులలో దాగున్న అద్భుత ఔషధం. ఇవి ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి, తల్లిపాలు పెంచడానికి, ప్రసవాన్ని సులభతరం చేయడానికి ఉపకరిస్తాయి. అధిక కొలెస్ట్రాల్, మధుమేహం నియంత్రణకు, మలబద్ధకం, జ్వరం, గొంతునొప్పి నుండి ఉపశమనం పొందడానికి మెంతులు ఎంతగానో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో మెంతులను చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఇదీ తులసి రహస్యం.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం.. ఉదయాన్నే రెండు ఆకులు చాలు..

తులసి మొక్క.. దాని ఆకులు, కాండం, వేరు భాగాలతో సహా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక వరం. తులసి ఒక అడాప్టోజెన్ వలె పనిచేస్తుంది. ఇది శరీరాన్ని ఒత్తిడికి అనుగుణంగా మార్చుకోవడానికి.. మానసిక సమతుల్యతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

చేదుగా ఉంటుంది కానీ.. ఈ 2 రోగాలకు దివ్యౌషధం.. ఉదయాన్నే అరకప్పు తాగితే..

ప్రపంచవ్యాప్తంగా.. డయాబెటిస్, యూరిక్ యాసిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి... ముఖ్యంగా మన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు యూరిక్ యాసిడ్, డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, ఈ కూరగాయ రసాన్ని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా.. వాటిని అదుపులో ఉంచుకోవచ్చు..

Diabetes: షుగర్ పెరుగుతుందని టెన్షన్ వద్దు మావ..? ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్.. బాబా రాందేవ్ ఏం చెప్పారంటే

బాబా రాందేవ్ యోగా, స్వదేశీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందారు. సహజ పదార్ధాలను ఉపయోగించి ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా ఆయన ప్రజలకు బోధిస్తారు. ఇప్పుడు, ఆహారం, కొన్ని యోగా భంగిమల ద్వారా టైప్ 1 డయాబెటిస్‌ను ఎలా తిప్పికొట్టాలో సూచనలు చేస్తున్నారు.. బాబా రాందేవ్ డయాబెటిస్ నియంత్రణకు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

డయాబెటిస్ రోగులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే షుగర్ అమాంతం పెరుగుతుంది..

శీతాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సీజన్‌లో సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

నల్ల కోడా మజాకా.. మటన్‌ కన్నా పవర్‌ఫుల్.. ఒక్కసారి తిన్నారంటే ఆ సమస్యలకు దబిడి దిబిడే

కడక్‌నాథ్ కోడి.. సాధారణంగా నల్ల కోడి అని పిలవబడే ఈ ప్రత్యేక జాతి కోడి మాంసం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది రుచిలో దేశీ కోడి కంటే ఉత్తమంగా ఉంటుందని, తినడానికి కొంచెం నల్లగా కనిపించినా, దాని పోషక విలువలు అనూహ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ కోడి మాంసం బీపీ, షుగర్ వంటి అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

ఈ లక్షణాలు కూడా డయాబెటిస్‌కు సంకేతం.. చలికాలం అని లైట్ తీసుకోకండి..

శీతాకాలంలో చాలా మందికి తరచుగా పాదాలు చల్లగా మారుతాయి.. బాగా చలి అనిపిస్తుంది.. దీనిని కేవలం వాతావరణ పరిస్థితిగా తోసిపుచ్చకూడదు.. ఎందుకంటే ఇది డయాబెటిస్ సంకేతం కూడా కావచ్చు. ఒక్కోసారి మరిన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. దీని గురించి డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఇప్పుడు రండి చూసుకుందాం.. రోగాలకే చుక్కలు చూపించే కూర.. పవర్ తెలిస్తే అస్సలు వదలరు..

చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం పుల్లని రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. చుక్కకూరలో విటమిన్‌లు A, C తో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, బీటా కెరోటిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

10 రోజులు షుగర్ తినడం మానేస్తే రప్పా రప్పే.. మన శరీరంలో జరిగేది తెలిస్తే అవాక్కే..

2023 లాన్సెట్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ టైప్ టు డయాబెటిస్ ఇన్సులిన్ నిరోధకత, ఉబకాయం, నాన్ ఆల్కహాలిక్ క్ ఫ్యాటీ లివర్ డిసీస్, గుండె జబ్బులు అనేక పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి గ్లూకోజ్ అనే చక్కెర కచ్చితంగా అవసరం..

Diabetes Symptoms: రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు షుగర్ వచ్చినట్లే..

ఈ రోజుల్లో చాలా మంది రక్తంలో అధిక చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు.. దీనిని డయాబెటిస్ అని కూడా పిలుస్తారు. గతంలో, ఈ పరిస్థితి కొంతమందికే పరిమితం అయ్యేది.. అంటే వృద్ధుల్లో మాత్రమే కనిపించేది.. కానీ నేడు, దాదాపు ప్రతి ఇంట్లో డయాబెటిస్ వ్యాధి ఉంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు.