డయాబెటిస్
ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా భారత్ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ దీర్ఘకాలిక వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. భారత్లో 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యంకాదు. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. మధుమేహం రావడానికి సరైన కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చాలా తక్కువగా లేదా అస్సలు విడుదల చేయకపోతే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోల్పోతుంది.
మధుమేహంలో ప్రాథమికంగా రెండు రకాలు ఉన్నాయి: అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం చిన్న వయస్సులోనే వస్తుంది. ఎక్కువగా వంశపారంపర్యంగా ఇది వచ్చే అవకాశముంది. వీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా కష్టం. అయితే, ఇప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉంది. జన్యుకారణాలతో పాటు ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక కేలరీల ఫాస్ట్ ఫుడ్ తినడం, ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ధూమపానం వంటి గాడి తప్పిన జీవన శైలి దీనికి ప్రధానంగా దోహదపడుతున్నాయి. అత్యధికులు ఈ టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. కొన్నిసార్లు గర్భధారణకు ముందు మధుమేహం లేని తల్లులకు గర్భధారణ తర్వాత మధుమేహం వస్తుంది. ఈ సమస్యను ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. గర్భధారణ సమయంలో, రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీ ఇన్సులిన్ అవసరం. కానీ బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వైద్య నిపుణుల అంచనాల ప్రకారం, భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో టీనేజర్లలోనూ భారీగా పెరిగే అవకాశముంది.
మధుమేహ బాధితులు ఎక్కువగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలకు గురవుతారు. మధుమేహ బాధితుల్లో ఆయుర్దాయం గణనీయంగా తగ్గే అవకాశముందని తాజా అధ్యయనాలు తేల్చాయి. యువకులు మధుమేహం బారినపడకుండా నివారించడం లేదా సాధ్యమైనంత మేరకు జాప్యం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కషాయం కాదు.. అమృతం.. 30 రోజులు తాగితే శరీరంలో జరిగే మార్పులివే..
మెంతుల నీరు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన మెంతుల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా.. షుగర్ నియంత్రణ, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటంలో అద్భుతంగా సహాయపడుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: May 27, 2026
- 9:36 am
30 డేస్ నో షుగర్ ఛాలెంజ్.. శరీరంలో అద్భుతాలే జరుగుతాయ్.. అస్సలు నమ్మలేరు
రోజూ తీసుకునే టీ, కాఫీ నుంచి స్వీట్లు, కూల్డ్రింక్స్ వరకు పంచదార మన జీవితంలో భాగమైపోయింది. అయితే కేవలం 30 రోజుల పాటు షుగర్కు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం, చర్మం మెరుస్తూ యవ్వనంగా కనిపించడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, డయాబెటిస్ ముప్పు తగ్గడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు.
- Yellender Reddy Ramasagram
- Updated on: May 20, 2026
- 6:07 pm
అన్నం vs చపాతీ.. రాత్రివేళ ఏది తింటే మంచిది.. పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్ ఇదే..
ప్రస్తుత జీవనశైలిలో చాలామంది రాత్రి భోజనంలో అన్నం మానేసి చపాతీల వైపు మొగ్గుచూపుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పరిమిత మోతాదులో తీసుకునే చపాతీలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు మేలు చేస్తాయి. చపాతీలో ఉండే పీచు పదార్థం ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి అతిగా తినకుండా సహాయపడుతుంది.
- Shaik Madar Saheb
- Updated on: May 13, 2026
- 7:41 pm
ఈ లక్షణాలు డేంజర్.. న్యాచురల్ టిప్స్తో డయాబెటిస్కు చెక్ పెట్టొచ్చు.. ఎవ్వరికీ తెలియని రహస్యమిదే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, భారతదేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటిస్తో ప్రభావితమవుతున్నారు.. భవిష్యత్తులో ఈ సంఖ్య నాలుగుకు పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, డయాబెటిస్పై పూర్తి అవగాహనతో ఉండటం చాలా మంచిది.
- Shaik Madar Saheb
- Updated on: May 9, 2026
- 5:51 pm
షుగర్ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ ఛూమంత్రం.. వీటిని తీసుకుంటే డయాబెటిస్ దరిదాపుల్లో కూడా ఉండదు..
నేటి జీవనశైలిలో మధుమేహం ఒక సాధారణ సమస్యగా మారింది. దీనిని నియంత్రించడానికి అనేక సహజ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతులలో భాగంగా కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల షుగర్ స్థాయిలను సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
- Shaik Madar Saheb
- Updated on: May 8, 2026
- 8:57 pm
స్వీట్ తిన్న 30 నిమిషాల్లో మీ శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. యమడేంజర్..
తీపి పదార్థాలు తిన్న కొద్ది నిమిషాల్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఇన్సులిన్ స్రావం అధికమవడం వంటి మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు మీకు మధుమేహం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 27, 2026
- 3:26 pm
ఒక్క జ్యూస్.. వందలాది లాభాలు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు..
ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురవుతున్న పలు అనారోగ్య సమస్యలకు కాకరకాయ రసం ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. ముఖ్యంగా మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచుపదార్థం అధికంగా ఉండటం వలన ఇది బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 21, 2026
- 5:04 pm
పిచ్చి తీగ అనుకునేరు.. పవర్ఫుల్.. ఉదయాన్నే కొంచెం తాగితే ఈ సమస్యలన్నీ పరార్..
తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తిప్పతీగ జ్యూస్ చేదుగా ఉండవచ్చు, కానీ ఇది సర్వరోగనివారిణి.. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆయుర్వేద మూలిక. ఇది దీర్ఘకాలిక జ్వరాలు, మధుమేహం, చర్మ సమస్యలు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఇంకా పలు సమస్యల నివారణలో సహాయపడుతుంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 2, 2026
- 8:51 am
వారెవ్వా.. ఒక్క పండుతో డయాబెటిస్ కంట్రోల్.. లాభాలు తెలిస్తే అవాక్కే..
ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో.. మధుమేహం (డయాబెటిస్) కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్నవారైనా, పెద్దవారైనా, అందరూ మధుమేహంతో బాధపడుతున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి చర్యలు తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అలాంటి వారికి బొప్పాయి పండు అద్భుతంగా సహాయపడుతుంది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 1, 2026
- 1:41 pm
ఆకలి.. ఆకలి.. ఆకలి.. అయ్యబాబోయ్.. ఇది డయాబెటిస్ ప్రారంభ సంకేతమేనా..
భోజనం చేసిన మూడు నుండి నాలుగు గంటల తర్వాత ఆకలిగా అనిపించడం సాధారణమే.. కానీ తిన్న కొన్ని గంటల్లోనే మళ్ళీ ఆకలిగా అనిపించడం.. తరచూగా ఏదైనా తినాలనిపించడం.. అనేది సాధారణమా లేక డయాబెటిస్ వంటి వ్యాధికి సంకేతమా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
- Shaik Madar Saheb
- Updated on: Feb 21, 2026
- 11:20 am
షుగర్ ఉన్న వారికి ఇది విషంతో సమానం.. మటన్, చికెన్, చేపల్లో ఏది బెస్ట్ అంటే..
షుగర్ ఉన్నవారు నాన్-వెజ్ ఆహారం తీసుకోవడంపై చాలామందిలో సందేహాలున్నాయి. చికెన్, మటన్, చేపలు తింటే.. షుగర్ పెరుగుతుందేమో.. ఇంకా తింటే ఎలా తినాలి..? ఎంత మోతాదులో తినాలి..? సందేహాలు కలుగుతుంటాయి.. అయితే.. డయాబెటిస్ రోగులు మటన్, ప్రత్యేకించి తలకాయ కూర వంటి రెడ్ మీట్ను పూర్తిగా నివారించాలని డైటీషియన్లు చెబుతున్నారు. వీటిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణకు రావడం కష్టం.
- Shaik Madar Saheb
- Updated on: Feb 16, 2026
- 3:18 pm
డయాబెటిస్ ఇబ్బంది పెడుతోందా..? నోటెన్షన్.. జస్ట్ ఈ నీటితో చెక్ పెట్టేయండి..
అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు మందులు, ఆహారంతో వారి రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అంతేకాకుండా కొన్ని చిట్కాలతో కూడా షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.. అవేంటో తెలుసుకుందాం..
- Shaik Madar Saheb
- Updated on: Feb 8, 2026
- 8:48 pm