AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని కాలాల్లో దొరికే ఈ ఆకుపచ్చ పండులో పోషకాలు మెండు..! రోగనిరోధక శక్తికి దివ్యౌషధం..ఇలా తింటే..

ఈ పండులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది వ్యక్తి దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిశుక్లం, మచ్చల క్షీణత అభివృద్ధిని నిరోధిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే ఈ పండులో మంచి డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం రోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటాయి.

అన్ని కాలాల్లో దొరికే ఈ ఆకుపచ్చ పండులో పోషకాలు మెండు..! రోగనిరోధక శక్తికి దివ్యౌషధం..ఇలా తింటే..
Guava
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2024 | 12:31 PM

Share

చలికాలంలో జామపండు తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని భావిస్తారు చాలా మంది. శీతాకాలంలో జామ పండు తింటే జలుబు, దగ్గు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, జామపండు బ్లాక్ సాల్ట్ కలిపి తింటే జలుబు, దగ్గు వంటి అనేక సమస్యల నుండి బయటపడవచ్చు అంటున్నారు. విపరీతమైన జలుబుతో బాధపడేవారు జామ పండ్లను బాగా తినాలని చెబుతున్నారు. ఈ పండును రోగనిరోధక శక్తికి దివ్యౌషధంగా సూచిస్తున్నారు. చలికాలం, ఎండాకాలం, వానాకాలం అనే తేడా లేకుండా.. సీజన్ ఏదైనా సరే.. చౌకగా దొరికే పండు జామ పండు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే జామ పండును పేదవాడి యాపిల్ గా కూడా పిలుస్తారు. జామ పండులో ఉండే పోషకాలు, ప్రయోజనాల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

జామపండులో పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, విటమిన్లు B2, E మరియు K, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, కాపర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. దీని కారణంగా కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. విశేషమేమిటంటే డయాబెటిక్ పేషెంట్లు కూడా జామపండు హ్యాపీగా తినవచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండే ప్రమాదం ఉండదు.హృద్రోగులు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా వీటిని తినొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, ప్రోటీన్లు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. దీన్ని పరిమితంగా తీసుకుంటే మధుమేహులకి, రక్తపోటు రోగులకి చాలా సురక్షితమైన పండు. కొవ్వుని కరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కేలరీలు తక్కువ ఉండే ఆహారం ఇది. పోషకాలు మెండుగా ఉంటాయి. జామకాయలోనే కాదు వాటి ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

చలికాలంలో జామపండ్లు తినడం వల్ల శరీరంలోని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను నివారిస్తుంది. జామపండు తినడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. నల్ల ఉప్పు కలిపి తింటే రోగాలు దరిచేరవు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు. డయాబెటిక్ రోగులకు బేరి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. జామపండు తినడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. దీనిని రోజులో ఎప్పుడైనా తినవచ్చు, కానీ రాత్రిపూట తినకూడదు. రాత్రి పూట ఎలాంటి పండు తినకూడదు.

ఇవి కూడా చదవండి

జామపండులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది వ్యక్తి దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జామపండు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిశుక్లం, మచ్చల క్షీణత అభివృద్ధిని నిరోధిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే జామపండులో మంచి డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం రోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఫైబర్, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటాయి. ఇది మధుమేహం అభివృద్ధిని నిరోధిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us