AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఈ పండు ఆరోగ్యానికి దివ్యౌషధం.. క్యాన్సర్‌, మధుమేహం వంటి రోగాలను తరిమి కొడుతుంది..!

ఈ పండు రసం రొమ్ము క్యాన్సర్ కణితులను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఈ పండు ఫైబర్ అద్భుతమైన మూలం. ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది. 

Health: ఈ పండు ఆరోగ్యానికి దివ్యౌషధం.. క్యాన్సర్‌, మధుమేహం వంటి రోగాలను తరిమి కొడుతుంది..!
Laxman Phal
Jyothi Gadda
|

Updated on: Feb 09, 2023 | 6:08 PM

Share

పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి శక్తినిచ్చే, వ్యాధులతో పోరాడే శక్తిని అందించే అనేక గుణాలు పండ్లలో ఉన్నాయి. కాబట్టి, మనం మన దినచర్యలో పండ్లను చేర్చుకోవాలి. సాధారణంగా ప్రజలు యాపిల్, అరటి, ద్రాక్ష, నారింజ, బొప్పాయి మొదలైన పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అయితే మీకు రక్తపోటు, షుగర్, క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధులతో పోరాడటానికి సహాయపడే ఒక పండు గురించి తెలుసుకోబోతున్నాం.. ఈ పండు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అదే లక్ష్మణ ఫలం.. భారతదేశంలో సోర్సోప్ అని పిలువబడే పండు ఇది. ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని శాస్త్రీయ నామం Annona muricata. దీనిని గ్వానాబానా, క్లా-క్లా మరియు గ్రావియోలా అని కూడా అంటారు. ఈ పండు సాధారణంగా సీతాఫల కుటుంబం నుంచి వచ్చిందంటారు. ఇది పెద్ద ఓవల్ ఆకారంలో ఉండే పండు. ఇది బయట ఆకుపచ్చ, లోపల తెలుపు రంగులో ఉండి… దాని మీద చిన్న చిన్న ముళ్ల మాదిరిగా ఉంటుంది. ఈ పండు రుచి స్ట్రాబెర్రీ, పైనాపిల్ కలయికగా ఉంటుంది. అంటే, ఇది తిన్న తర్వాత ఈ రెండు పండ్లను (స్ట్రాబెర్రీ, పైనాపిల్) కలిపి తింటున్న అనుభూతి కలుగుతుంది. రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి చాలా మేలు చేసే ఈ పండులో విటమిన్లు, పోషకాలు చాలా ఉన్నాయి. ఈ పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

లక్ష్మణ ఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరాన్ని ఎప్పుడూ శక్తివంతంగా ఉంచే పండు ఇది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్ నిధి. పండు, దాని ఆకులు ఫైటోస్టెరాల్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్లతో సహా అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని అనేక వ్యాధులను కూడా నయం చేస్తాయి.

లక్ష్మణ ఫలం తినడం వల్ల మీ శరీరంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదు. దీని ఉపయోగం క్యాన్సర్ నివారణ, చికిత్సలో సహాయపడుతుంది. ఒక పరిశోధన ప్రకారం, లక్ష్మణ ఫలం రసం రొమ్ము క్యాన్సర్ కణితులను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఈ పండు ఫైబర్ అద్భుతమైన మూలం. ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

లక్ష్మణ ఫలం మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో కూడా చాలా సహాయపడుతుంది. అంతే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఈ పండులో ఉన్నాయి. ఈ కారణంగా, ఇది మీ బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుంది. ఈ పండు రసం కలరాకు వ్యతిరేకంగా కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఒక అధ్యయనం నిరూపించింది. ఈ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మోకాళ్ల వాపును తగ్గించగలవు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం