Mangoes in Summer: మామిడి పండ్లను ఇలా తింటే.. మీ ఇమ్యునిటీ డబుల్ అవ్వడం పక్కా..!
ఇలా తీసుకుంటే ఉబ్బరం నిరోధించడానికి సహాయపడుతుంది. అంతేకాదు..మామిడి ఆకులను మిక్సీలో పేస్టులా చేసి మీగడలో కల్పి ముఖంకు అప్లై చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక వారంపాటు చేస్తే ముఖంపై మచ్చలు మొటిమలు, బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయని అంటున్నారు.

వేసవి అంటేనే మామిడి పండ్లకు మంచి సీజన్.. సమ్మర్ సీజన్ లో మార్కెట్లో ఎటు చూసినా రకరకాల మామిడి పండ్లు పుష్కలంగా దర్శనమిస్తుంటాయి. మామిడి పండ్లు కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా పుష్కలమైన పోషకాలను అందిస్తుంది. మామిడి రోగనిరోధక శక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడతాయి. గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులతో పోరాడి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే మీరు మామిడి పండ్లను సరైన పద్ధతిలో తింటున్నారా? మామిడి పండ్లను తినేందుకు ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మామిడిలో విటమిన్ లు, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మామిడిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి క్రమంగా పెరుగుతుంది. మామిడి పండ్లను ముక్కలు చేసుకుని, మిక్సీలో పెస్ట్ లా చేసి పాలల్లో కలుపుకుని తింటే రెట్టింపు ప్రయోజనం అంటున్నారు నిపుణులు. మామిడి జ్యూస్ తాగిన కూడా ఎముకలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు.
పండిన మామిడి పండు పాలను కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి మంచి రంగును తెస్తుంది. అంతేగాక ఇది శరీరాన్ని చల్లబరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఇది అధిక పోషకాలు అందిస్తుంది. భోజనం తర్వాత లేదా దానితో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. అయితే, మామిడి పండ్లను భోజనంతో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఉబ్బరం నిరోధించడానికి సహాయపడుతుంది.
అంతేకాదు..మామిడి ఆకులను మిక్సీలో పేస్టులా చేసి మీగడలో కల్పి ముఖంకు అప్లై చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక వారంపాటు చేస్తే ముఖంపై మచ్చలు మొటిమలు, బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయని అంటున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








