AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఫైబర్‌ ఫుడ్‌తో మతిమరపు కూడా దూరం.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం జీర్ణ సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా.. మెదడు ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి..

Health: ఫైబర్‌ ఫుడ్‌తో మతిమరపు కూడా దూరం.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు..
అలాగే బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడటానికి వ్యాయామం చాలా అవసరం. ఇది మెదడు కణాలను తాజాగా ఉంచుతుంది. యాక్టివేట్ చేయబడతాయి. వ్యాయామం చేయడం వల్ల శరీరం తేలికగా మారుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ నుండి బయటపడాలంటే, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి. కూరగాయలు, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Narender Vaitla
|

Updated on: Oct 30, 2024 | 6:18 PM

Share

తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఫైబర్‌ కంటెంట్‌ ఉండాలని నిపుణులు చెబుతుంటారు. జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవ్వాలంటే కచ్చితంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండాలని అంటుంటారు. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పీచు పదార్థం ఉండాలని సూచిస్తుంటారు.

బరురు తగ్గాలనుకునే వారు కూడా ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవాలని అంటారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గడంలో కూడా ఫైబర్‌ కంటెంట్‌ ఉపయోగపడుతుంది. అయితే ఫైబర్‌ ఫుడ్‌తో కేవలం ఇవే కాకుండా మరో లాభం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. మతిమరుపు సమస్యను కూడా దూరం చేయడంలో ఫైబర్‌ ఫుడ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా నిర్వహించిన పరిశోధనలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇందులో భాగంగా 40-60 ఏళ్ల వయసువారి ఆహార అలవాట్లను పరిశీలించారు. ఏకంగా 16 ఏళ్లపాటు ఆహార సర్వేను నిర్వహించారు. వీరిలో ఎవరెవరు డిమెన్షియా బారినపడ్డారో గుర్తించి వారు తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్‌ కంటెంట్‌ గురించి ఆరా తీశారు. ఆహారంలో ఎక్కువ పీచు తీసుకున్నవారికి డిమెన్షియా తక్కువ ముప్పు ఉంటున్నట్టు కనుగొన్నారు.

రోజులో సగటున 20 గ్రాముల పీచు తీసుకున్న వారికి డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే 8 గ్రాములే తీసుకున్న వారికి ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటే.. బరువు, రక్తపోటు అదుపులో ఉంటాయి. ఆలోచన శక్తిని సన్నగిల్లజేసే వ్యాస్కులర్‌ డిమెన్షియా బారినపడకుండా కాపాడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.

ఇక ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటే.. పేగుల్లో మంచి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. మెదడు-పేగుల అనుసంధానం ద్వారా మెదడులో వాపుప్రక్రియను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి పరోక్షంగా ఫైబర్‌ ఫుడ్‌ జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..