Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Report: దేశంలోని 55 శాతం మంది డ్రైవర్లకు కంటిచూపు బలహీనం.. మానసిక సమస్యలు.. కీలక నివేదిక

Health Report: దేశంలో డ్రైవర్ల విషయంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కీలక నివేదిక విడుదల చేసింది. కంటి సమస్య, ఇతర మానసిక అనారోగ్య సమస్యలపై ఈ నివేదికను రూపొందించింది. వారి కంటి చూపు బలహీనంగా ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేసింది..

Health Report: దేశంలోని 55 శాతం మంది డ్రైవర్లకు కంటిచూపు బలహీనం.. మానసిక సమస్యలు.. కీలక నివేదిక
Follow us
Subhash Goud

|

Updated on: Feb 02, 2025 | 10:02 AM

భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ట్రక్ డ్రైవర్లకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ట్రక్కు డ్రైవర్ల ఆరోగ్యానికి సంబంధించినది. నివేదిక ప్రకారం, దేశంలోని ట్రక్ డ్రైవర్లు బలహీనమైన కంటి చూపు, మానసిక ఆరోగ్య సమస్యలతో సహా అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దేశంలో 55.1 శాతం ట్రక్ డ్రైవర్లు బలహీనమైన కంటి చూపుతో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 53.3% మంది డ్రైవర్లకు దూర దృష్టి కోసం అద్దాలు అవసరం కాగా, 46.7% మంది డ్రైవర్లు కంటి చూపును మెరుగుపరుచుకోవాలి. దేశంలోని డ్రైవర్లలో 33.9 శాతం మంది మోస్తరు ఒత్తిడితో బాధపడుతున్నారని, 2.9 శాతం మంది తీవ్రమైన ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.

ఇది కాకుండా 44.3 శాతం మంది ట్రక్ డ్రైవర్లు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారని కూడా నివేదిక పేర్కొంది. అలాగే, 57.4 శాతం డ్రైవర్లలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే 18.4 శాతం డ్రైవర్లలో చక్కెర స్థాయి పెరిగినట్లు కనుగొన్నారు.

దేశ రవాణా వ్యవస్థకు వెన్నెముక:

ఇవి కూడా చదవండి

ట్రక్కులు భారతదేశం లాజిస్టిక్స్ వ్యవస్థకు వెన్నెముక. దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రవాణా చక్రాన్ని పూర్తి చేస్తాయి. అయితే, ట్రక్కు డ్రైవర్లు చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదికలో ఇచ్చిన డేటా చూపిస్తుంది. వారు చాలా గంటలు సక్రమంగా షిఫ్టులలో పనిచేయవలసి ఉంటుంది. అలాగే వారి కుటుంబాలకు దూరంగా ఉండాలి. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ట్రక్ డ్రైవర్ల ఆరోగ్యం, పని పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక ద్వారా స్పష్టమైంది.

100 ట్రక్కుల్లో 75 మంది డ్రైవర్లు మాత్రమే:

నివేదికను విడుదల చేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్లపై 70% ట్రాఫిక్, లాజిస్టిక్స్ ఖర్చు 14 నుండి 16% వరకు పెరగడంతో భారతదేశం రవాణా రంగంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. భారతదేశ రవాణా రంగంలో ప్రధాన సమస్య ట్రక్కు డ్రైవర్ల కొరత అని కూడా ఆయన చెప్పారు. దేశంలో ప్రతి 100 ట్రక్కులకు 75 మంది డ్రైవర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. డ్రైవర్ శిక్షణపై పని చేస్తున్నామని, ఈ సమస్యను పరిష్కరించడానికి వారి ఆరోగ్యం, జీవనశైలిని మెరుగుపరుస్తామన్నారు. అలాగే డిజిటల్ టెక్నాలజీలు, యాప్‌లు కూడా డ్రైవర్‌ల కోసం ఉపయోగపడతాయన్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి