AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఏడాది పాల‌న‌పై మేధోమథనం

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా.. నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స‌ర్కార్ డిసైడ‌య్యింది. ‘మన పాలన- మీ సూచన పేరుతో మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ‘పరిపాలన–సంక్షేమం’, ‘గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ’పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన‌ ఈ కార్యక్రమం జిల్లాలకు […]

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఏడాది పాల‌న‌పై మేధోమథనం
Ram Naramaneni
|

Updated on: May 25, 2020 | 4:36 PM

Share

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా.. నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స‌ర్కార్ డిసైడ‌య్యింది. ‘మన పాలన- మీ సూచన పేరుతో మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ‘పరిపాలన–సంక్షేమం’, ‘గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ’పై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన‌ ఈ కార్యక్రమం జిల్లాలకు లైవ్ టెలికాస్ట్​ను ప్రసారం చేశారు. జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. 25న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, 26న వ్యవసాయ సంబంధిత రంగాలు, 27న విద్యారంగంలో కీల‌క మార్పులు , 28 న మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, గృహనిర్మాణం, 29న ఆరోగ్యం వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 30 తేదీన సీఎం జగన్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో 50 మందికి మించి హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

తొలిరోజు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం గ్రామ వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నామని ఆనందం వ్య‌క్తం చేశారు. ప్రతి 2 వేల జనాభా కలిగిన గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని 11,162 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని వెల్ల‌డించారు. లక్షా 35 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త‌ బహుశా మ‌రెక్క‌డ‌ ఉండదేమోనని జగన్ అభిప్రాయ‌ప‌డ్డారు. 82.5 శాతం ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలే ఉన్నార‌ని వివ‌రించారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు, సేవలు చేరువ చేస్తున్నామ‌న్న‌ సీఎం… అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశామన్నారు.

Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది