యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

గంజాయి మత్తులో కొందరు యువకులు నడిచి వెళ్తున్న వ్యక్తిపై కత్తితో దాడి

యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి
Follow us

|

Updated on: Jun 01, 2020 | 6:13 PM

తిరుపతిలో కొందరు యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. ఒంటరిగా నడిచి వెళ్తున్నవారే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. తాజాగా యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. గంజాయి మత్తులో కొందరు యువకులు అతనిపై కత్తితో దాడి చేశారు. వెంటనే గమనించిన స్థానికులు అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. స్థానిక తాతయ్యగుంటకు చెందిన కొందరు యువకులు గంజాయి సేవించి దారినపోయే ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో వెంకటసాయి అనే యువకుడిపై దాడికి దిగారు.  తీవ్రంగా గాయపడ్డ యువకుడిని స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు షరా మామూలు అయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని కట్టడి చేయాలని కోరుతున్నారు. వెంకటసాయిపై దాడికి పాల్పడిన ఆరుగురు యువకులపై తిరుపతి ఈస్ట్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Articles
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా
చాహల్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్..భార్య ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్
చాహల్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్..భార్య ధనశ్రీ వర్మ పోస్ట్ వైరల్
మేడ్ ఇన్ ఆంధ్రా ఎలక్ట్రిక్ బైక్ ఇది.. సింగిల్ చార్జ్‌పై 210కి.మీ.
మేడ్ ఇన్ ఆంధ్రా ఎలక్ట్రిక్ బైక్ ఇది.. సింగిల్ చార్జ్‌పై 210కి.మీ.
మళ్లీ బాహుబలి వస్తోంది.. కానీ ఈసారి సరికొత్తగా..
మళ్లీ బాహుబలి వస్తోంది.. కానీ ఈసారి సరికొత్తగా..
సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..!
సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..!