AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్ ధరిస్తారా?.. జరిమానా కడతారా?.. మూడేళ్లు జైలుకెళ్తారా?

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో నగరపాలక సంస్థ

మాస్క్ ధరిస్తారా?.. జరిమానా కడతారా?.. మూడేళ్లు జైలుకెళ్తారా?
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 12, 2020 | 6:01 PM

Share

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో నగరపాలక సంస్థ మరిన్ని కఠిన నిబంధనలకు సిద్ధమైంది. ఇకపై ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, లేకుంటే రూ. 5 వేల జరిమానా లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ఆదివారం ఈ ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. రేపటి (సోమవారం) నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి నగర పరిధిలో ప్రతి ఒక్కరు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరని కమిషనర్ పేర్కొన్నారు. మాస్క్ లేకుండా కనిపించిన వారికి రూ. 5 వేల జరిమానా విధిస్తామని, చెల్లించడంలో విఫలమైతే మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మార్కెట్లో దొరికేవైనా, ఇంట్లో తయారుచేసినవి అయినా ఫరవాలేదని ఆయన వివరించారు. కనీసం ముఖానికి రుమాలైనా కట్టుకోవాలని సూచించారు.

ఇప్పుడు కోవిద్ 19 దేశంలోని అని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దీంతో.. వ్యాపారులు, దుకాణదారులు సహా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, వందశాతం అందరూ నిబంధనలు పాటిస్తారని భావిస్తున్నట్టు కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 266కు పెరిగింది. గుజరాత్‌లోనే ఇది అత్యధికం. అలాగే, నగరంలో 11 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

Follow Us
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్