AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైలో నీటి కొరత.. అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి కర్ణాటక బ్రేక్

చెన్నైలో నీటి కరువు ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు బెంగళూరులో కూడా నీటి కొరత సమస్య వెంటాడుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రతిపాదన చేసింది. వచ్చే ఐదేళ్లలో బెంగళూరులో కొత్తగా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని కర్ణాటక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర తెలిపారు. నగరంలో కనీసం నీటి వసతి లేని అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయని.. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి అంశాలన్నింటిని పరిశీలించిన తర్వాతే ఐదేళ్ల వరకూ కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి […]

చెన్నైలో నీటి కొరత.. అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి కర్ణాటక బ్రేక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 8:08 PM

Share

చెన్నైలో నీటి కరువు ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు బెంగళూరులో కూడా నీటి కొరత సమస్య వెంటాడుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రతిపాదన చేసింది. వచ్చే ఐదేళ్లలో బెంగళూరులో కొత్తగా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని కర్ణాటక డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర తెలిపారు. నగరంలో కనీసం నీటి వసతి లేని అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయని.. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి అంశాలన్నింటిని పరిశీలించిన తర్వాతే ఐదేళ్ల వరకూ కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. కొత్త అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి బ్రేక్ వేయడంతో పాటు వివిధ మార్గాల ద్వారా బెంగళూరు నగరానికి నీటిని తరలించే పనులను ఈ ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, ప్రభుత్వ ప్రతిపాదన పై డెవలపర్లు మండిపడుతున్నారు. ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కు. ప్రభుత్వం తమ వద్ద ఉన్న డేటాను పట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే అది నెగిటివ్‌గా మారుతుందని చెబుతున్నారు. బెంగళూరు నగరం ఊహించిన దాని కంటే వృద్ది చెందుతోంది. అయితే, అందుకు తగ్గట్టు ప్లాన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది. కాని కొత్త అనుమతులు ఇవ్వం అని చెప్పడం సరికాదంటున్నారు.