Venkaiah Naidu: రేపు ఆంధ్రప్రదేశ్కు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మూడు రోజుల పాటు పర్యటన
ఆంధ్రప్రదేశ్ లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. విజయవాడలో మూడు రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ...

ఆంధ్రప్రదేశ్ లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. విజయవాడలో మూడు రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. రేపు స్వర్ణభారత్ ట్రస్ట్ లో బస చేయనున్నారు. 28న సూరంపల్లిలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్, టెక్నాలజీలోని కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నారు. 29న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. అలాగే వెంకయ్యనాయుడు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అ్కడి నుంచి వెంకయ్యనాయుడు బెంగళూరుకు వెళ్లనున్నారు.
Follow Us
