ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం..జొమాటో ద్వారా ఇంటికే కూరగాయలు, పండ్లు

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో ఏపీ ప్రభుత్వం పనితీరు భేష్ అంటూ ఇటీవ‌ల ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సైతం ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. ఇక అదే బాట‌లో స‌ర్కార్ మ‌రో ముంద‌డుగు వేసింది. వినియోగ‌దారుల‌కు ఇళ్ల వ‌ద్ద‌కే కూర‌గాయ‌లు, పండ్లు చేర‌వేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం, ఆహార సరఫరా సంస్థ జొమాటో సంస్థ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఆదివారం నుంచి ఈ సేవలు ప్ర‌యోగాత్మ‌కంగా విజయవాడ, విశాఖపట్నంలో ప్రారంభించిన‌ట్టు రైతు బజార్ల సీఈవో ఇస్రార్​ అహ్మద్​ తెలిపారు. స‌ద‌రు ప్రాంతాల్లో […]

ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం..జొమాటో ద్వారా ఇంటికే కూరగాయలు, పండ్లు
Follow us

|

Updated on: Apr 20, 2020 | 3:10 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో ఏపీ ప్రభుత్వం పనితీరు భేష్ అంటూ ఇటీవ‌ల ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సైతం ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. ఇక అదే బాట‌లో స‌ర్కార్ మ‌రో ముంద‌డుగు వేసింది. వినియోగ‌దారుల‌కు ఇళ్ల వ‌ద్ద‌కే కూర‌గాయ‌లు, పండ్లు చేర‌వేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం, ఆహార సరఫరా సంస్థ జొమాటో సంస్థ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఆదివారం నుంచి ఈ సేవలు ప్ర‌యోగాత్మ‌కంగా విజయవాడ, విశాఖపట్నంలో ప్రారంభించిన‌ట్టు రైతు బజార్ల సీఈవో ఇస్రార్​ అహ్మద్​ తెలిపారు.

స‌ద‌రు ప్రాంతాల్లో విజ‌య‌వంతం అవ్వ‌డంతో..రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని విస్త‌రించ‌నున్నారు. ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తకుండా శుభ్ర‌త పాటిస్తూ, నాణ్య‌మైన ఫ్యాకింగ్ విధానంతో ప్ర‌జ‌ల‌కు ఈ సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.