బాలిక లివర్ తింటే పిల్లలు పుడతారని, ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం..
ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లోని భద్రాస్ గ్రామంలో దారుణం జరిగింది. దీపావళి పండుగ రోజు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఇద్దరు ఉన్మాదులు అనంతరం అతి కిరాతకంగా చంపేశారు.
ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లోని భద్రాస్ గ్రామంలో దారుణం జరిగింది. దీపావళి పండుగ రోజు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఇద్దరు ఉన్మాదులు అనంతరం అతి కిరాతకంగా చంపేశారు. ఆపై ఆమె శరీరం నుంచి అవయవాలు తొలగించారు. బాలిక కాలేయం తింటే పిల్లలు పుడతారు అనే మూఢనమ్మకంతో దగ్గరి బంధువే.. సుపారీ ఇచ్చి ఈ ఆకృత్యానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే..చనిపోయిన చిన్నారికి బంధువువైన పరశురామ్కి పెళ్లై 21 ఏళ్లు దాటినా సంతానం కలగలేదు. దీంతో క్షుద్రపూజలు చేసేవారిని ఆశ్రయించి..తన పిల్లలు పుట్టే మార్గం చెప్పమని అడిగాడు. బాలిక కాలేయం తింటే పిల్లలు కలిగే అవకాశం ఉందని సదరు మాంత్రికుడు చెప్పాడు. దీంతో గ్రామంలోని అంకున్, వీరన్లకు సుపారీ ఇచ్చి చిన్నారి కాలేయం తీసుకురమ్మని ఉసిగొల్పాడు. ఈ విషయాన్ని విచారణలో అతడే స్వయంగా పోలీసులకు వెల్లడించారు.
ఆ చిట్టి తల్లి ప్రాణం తీయడానికి ఆ ఉన్మాదులు తీసుకున్న సుపారీ రూ.1500. అది అందిన వెంటనే దీపావళి పండుగ నాడు చిన్నారికి బాణసంచా ఇప్పిస్తానని చెప్పి నిందితులు తీసుకువెళ్లారు. తర్వాత అత్యాచారం చేసి, బాలిక దారుణంగాా చంపేశారు. శరీరం నుంచి అవయవాలు తొలగించి పరుశురామ్కు అప్పచెప్పినట్లు నిందితులు పోలీసులు తెలిపారు.
Also Read :
పాపం.. టపాసు పేలి..అతడి కొత్త కారు పూర్తిగా దగ్ధమైంది