పాపం.. టపాసు పేలి..అతడి కొత్త కారు పూర్తిగా దగ్ధమైంది
టపాసులు కాల్చేటప్పుడు మనం మాత్రమే కాదు..ఎదుటి వ్యక్తులు, వస్తువుల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఊహించని ప్రమాదాలు సంభవిస్తాయి.
టపాసులు కాల్చేటప్పుడు మనం మాత్రమే కాదు..ఎదుటి వ్యక్తులు, వస్తువుల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఊహించని ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాద ఘటనలు ప్రతి ఏటా దీపావళి సమయంలో మనం చూస్తేనే ఉన్నాం. తాజాగా రూ.14లక్షలతో ఎంతో ముచ్చటపడి కొన్న కొత్త కారు రెండు నెలలు కూడా గడవకుండానే అగ్నికి ఆహుతైైపోయింది. దీపావళి ఆనంద సమయాల్ని పంచుకోవడానికి స్నేహితుల వద్దకు వచ్చిన వ్యక్తి కారు అందరు చూస్తుండగానే టపాసుల ధాటికి కాలి బూడిదైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని తొండుపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది.
శంషాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం, మోకిలకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కొనుగోలు చేసిన కొత్త కారులో తొండుపల్లి ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడే ఇంటి ముందు కారు పార్క్ చేశాడు. అదే బస్తీకి చెందిన వేణు భారీ టపాసులను కాల్చి కారుపైకి పారేయడంతో ఒక్కసారిగా నిప్పంటుకుంది. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అందరూ చూస్తుండగానే కారు పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
స్టేట్ సెక్యూర్టీ కమిషన్లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !