విషాదం.. దీపావళి వేడుకల్లో బీజేపీ ఎంపీ మనవరాలు మృతి
బీజేపీ ఎంపీ(లోక్సభ) రీటా బహుగుణ జోషి నివాసంలో విషాదం నెలకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చుతుండగా జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆమె 8 ఏళ్ల మనవరాలు ప్రాణాలు కోల్పోయింది.
బీజేపీ ఎంపీ(లోక్సభ) రీటా బహుగుణ జోషి నివాసంలో విషాదం నెలకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చుతుండగా జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆమె 8 ఏళ్ల మనవరాలు ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలతో ఎయిమ్స్లో చికిత్స పొందుతోన్న బాలిక కొద్దిసేపటి కిందట మృతి చెందినట్లు వైద్యుల ధృవీకరించారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని తన ఇంటి టెర్రస్ మీద క్రాకర్స్ కాల్చుతున్న సమయంలో ఆ బాలిక తీవ్రంగా గాయపడ్డారు. తోటి పిల్లలతో కలిసి బాణాసంచాను కాల్చుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలాసేపటి వరకు ఎవరూ ఆ బాలిక గాయపడినట్లు గుర్తించకపోవడంతో ఈ విషాదం నెలకుంది. టపాకుల మోతలో బాలిక ఏడుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ సమయంలో తోటి పిల్లలు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. బాణాసంచా కాల్చే సమయంలో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగిందని వైద్యులు చెప్పారు. గాయపడ్డ బాలికను కుటుంబ సభ్యులు తొలుత ప్రయాగ్రాజ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలైనట్లు గుర్తించిన అక్కడి డాక్టర్లు.. పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఈ ఉదయం బాలిక మరణించింది. మృతదేహాన్ని ఎయిమ్స్ నుంచి ప్రయాగ్రాజ్ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ లోక్సభ స్థానానికి రీటా బహుగుణ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.
Also Read :
స్టేట్ సెక్యూర్టీ కమిషన్లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !