కాజల్ హనీమూన్పై ట్రోలింగ్ !
అందాల చందమామ కాజల్ అగర్వాల్ మొత్తానికి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన చందమామ..
అందాల చందమామ కాజల్ అగర్వాల్ మొత్తానికి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన చందమామ..ఎన్నో హృదయాలు గాయపరిచి తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి అక్టోబర్ 30న ఏడడుగులు నడిచింది. ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమాలతో పాటు పెళ్లి సమయంలో కూడా కాజల్ ఎంతో ఆనందంగా కనిపించింది. అయినా కరోనా నేపథ్యంలో ఈ దంపతులు మనీమూన్కు వెళ్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జీవితంలో మధుర క్షణాలు దాచుకునేందుకు ఈ జంట మాల్దీవ్స్కు వెళ్లారు. అక్కడ భర్తతో కలిసి ఎంజాయ్ చేసింది కాజల్. వివిధ సందర్భాల్లో అక్కడ తీసుకున్న ఫోటోలు కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరలవుతున్నాయి.
ఇక్కడివరకు అంతా బానే ఉంది కానీ, ఇప్పుడు కాజల్ దంపతులు చుట్టు కొత్త ట్రోలింగ్ మొదలయ్యింది. హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన కాజల్-కిచ్లూ అండర్ వాటర్ హోటల్లో గడిపారు. దాని ఖర్చు ఒక రాత్రికి రూ. 37 లక్షలట. ఈ కోవిడ్ సమయంలో తినడానికి తిండి లేక, కనీసం నిలబడటానికి కూడా జాగ లేక వలస కూలీలు, పేద వర్గాలు అల్లాడిపోతుంటే హనీమూన్ పేరుతో అంత డబ్బు వృధా చేస్తారా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అవి అని..ఎంజాయ్ చేస్తే తప్పేంటి అంటూ కొందరు కాజల్కు మద్దతుగా నిలుస్తున్నారు.
కాగా కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్కు హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినీ కార్మికులకు తనవంతు సాయం అందించారు. సీసీసీకి రూ. 2 లక్షల విరాళం అందజేశారు.
Also Read :
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !
ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా