AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని మోదీ విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Watch Video: దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని మోదీ విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Janardhan Veluru
|

Updated on: May 03, 2024 | 3:39 PM

Share

ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌ టీవీ9 ప్రోగ్రాంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ వస్తాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనను బడే భాయ్ అంటున్నారన్న మోదీ.. పెద్దల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో డబులార్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.

ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌ టీవీ9 ప్రోగ్రాంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ వస్తాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనను బడే భాయ్ అంటున్నారన్న మోదీ.. పెద్దల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో డబులార్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ప్రధాన మంత్రి అండ్ 5 ఎడిటర్స్ టీవీ9 ప్రోగ్రాంలో మోదీ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో డబులార్ ట్యాక్స్ లేదని.. ఈ విషయంలో మోదీ మాటల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీ పాలన అందిస్తోందన్నారు. దేశంలో అదానీ, అంబానీ కోసం డబుల్ ఏ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోందని.. అందుకే మోదీ ఈ రకంగా మాట్లాడారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండో స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీపడుతున్నాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు తావు ఉండదని అన్నారు.

Published on: May 03, 2024 03:37 PM