వైఎస్ అండ మాకు కొండంత : ఉండవల్లి సతీమణి జ్యోతి
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సతీమణి జ్యోతి. వైఎస్ను తమ కుటుంబానికి ఎంతో మేలు చేశారని చెప్పారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో మంగళవారం జరిగిన ‘వైఎస్ఆర్తో ఉండవల్లి..’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జ్యోతి మాట్లాడారు. అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్తో ప్రేమ వివాహానికి సిద్దమైనప్పుడు.. తమ ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారని జ్యోతి అన్నారు. ఏదైనా పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉంటే […]
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సతీమణి జ్యోతి. వైఎస్ను తమ కుటుంబానికి ఎంతో మేలు చేశారని చెప్పారు. హైదరాబాద్ దస్పల్లా హోటల్లో మంగళవారం జరిగిన ‘వైఎస్ఆర్తో ఉండవల్లి..’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జ్యోతి మాట్లాడారు. అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్తో ప్రేమ వివాహానికి సిద్దమైనప్పుడు.. తమ ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారని జ్యోతి అన్నారు. ఏదైనా పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉంటే బాగుండేదని, అలాంటి ఉద్యోగం ఉన్న భర్త వస్తే జీవితం బాగుంటుందని తన తల్లి ఎప్పుడూ చెప్పేవారన్నారు. అదే సమయంలో ఉండవల్లి పలు బ్యాంకు జాబ్స్ కోసం పరీక్షలు రాయగా.. ఎందులోనూ అర్హత సాధించలేదని… చివరకి ఇక తనకు రాజకీయం తప్ప మరొకటి తెలియదని ఓరోజు తమ అమ్మతో చెప్పారని అన్నారు. ఇక అప్పటినుంచి ఆమె కూడా పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారని.. వైఎస్ఆర్ గుర్తించి ప్రోత్సహించకపోతే ఈ స్థాయిలో ఉండేవారు కాదని చెప్పుకొచ్చారు . సాధారణ కార్యకర్తగా ఉన్న తన భర్తను ఎంపీ చేశారని, దీంతో ఇప్పుడాయనకు ‘పెన్షన్’ వస్తుందని అన్నారు. అలా మొత్తం మీద తన తల్లి తమ గురించి ఏదైతే కోరుకుందో.. వైఎస్ఆర్ దాన్ని నెరవేర్చారని చెప్పారు.