ఒకే ట్రాక్‌పై రెండు రైళ్ల ఢీ.. మానవ తప్పిదమేనంటున్న అధికారులు!

భాగ్యనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు రెండూ కూడా ఒకే ట్రాక్ మీదకు రావడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పదించిన రైల్వే అధికారులు.. లోకో పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ధృవీకరించారు. ఇప్పటికే లింగంపల్లి- ఫలక్‌నామా మధ్య ట్రైన్ల రాకపోకలు నిలిపివేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఏజీఎం బి.బి.సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని.. […]

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్ల ఢీ.. మానవ తప్పిదమేనంటున్న అధికారులు!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 11, 2019 | 5:06 PM

భాగ్యనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు రెండూ కూడా ఒకే ట్రాక్ మీదకు రావడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పదించిన రైల్వే అధికారులు.. లోకో పైలెట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ధృవీకరించారు. ఇప్పటికే లింగంపల్లి- ఫలక్‌నామా మధ్య ట్రైన్ల రాకపోకలు నిలిపివేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఏజీఎం బి.బి.సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని.. అటు సిగ్నలింగ్ లోపానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే ఎంఎంటీఎస్ ట్రైన్‌ను వేగంగా వచ్చి ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టడంతో.. సుమారు 6 బోగీలు బాగా దెబ్బ తిన్నాయని.. ప్రమాదంలో గాయపడిన 12 మంది ప్రయాణికులు చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఇకపోతే మరో క్యాబిన్‌లో ఇరుకున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌ డ్రైవర్‌ను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు కొనసాగించాయి. గ్యాస్ కట్టర్ సహాయంతో క్యాబిన్ కట్ చేసి.. అతనికి ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా బయటి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాయి. అటు స్వల్పగాయాలతో బయటపడిన ఇద్దరు ప్రయాణికులను ప్రాధమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.

ఇక ఈ ఘటనపై రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ‘ హైదరాబాద్‌లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ హృదయాన్ని కలిచి వేసిందని.. సహాయక బృందాలను ఘటనాస్థలానికి పంపించామన్నారు. అంతేకాకుండా గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు’.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..