ఒకే ఫ్రేములో అల్లు అర్జున్, ఎన్టీఆర్!

కొంత మంది స్టార్స్ వంటలు చేస్తూ.. తమ ఫ్యామిలీతో సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. అలాగే తమ పాత మెమొరీస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అలా.. కలువ కళ్ల సుందరి కాజల్ తాజాగా ఓ పాత ఫొటోని షేర్ చేస్తూ..

ఒకే ఫ్రేములో అల్లు అర్జున్, ఎన్టీఆర్!
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 4:56 PM

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అంతేకాకుండా.. పలు మీడియా ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అలాగే కొంత మంది స్టార్స్ వంటలు చేస్తూ.. తమ ఫ్యామిలీతో సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. అలాగే తమ పాత మెమొరీస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అలా.. కలువ కళ్ల సుందరి కాజల్ తాజాగా ఓ పాత ఫొటోని షేర్ చేస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇందులో స్టార్ హీరోస్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు డైరెక్టర్స్ పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల, హీరోయిన్లు కాజల్, అమలాపాల్‌ ఉన్నారు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్‌షా, అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్ర షూటింగ్ బార్సిలోనాలో ఒకే సమయంలో జరిగింది. అలా అందరూ ఒకే చోట కలిశారు. అప్పుడు హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు కలిసి ఓ ఫొటో తీసుకున్నారు. అదే ఫొటోను కాజల్ షేర్ చేస్తూ.. ‘ఫారెన్ లొకేషన్‌లో అందరూ ఖుషీఖుషీగా కనిపిస్తున్నారు. మళ్లీ మీ అందర్నీ కలవాలని ఆతృతగా ఉందని తన పోస్ట్‌లో తెలిపింది కాజల్’.

2013లో ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్‌షా తెరకెక్కగా.. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. అదే ఏడాది అల్లు అర్జున్ హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా పూరీ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా రూపొందింది. కాగా ఈ రెండు సినిమా షూటింగ్‌లు ఫారెన్ లొకేషన్‌ బార్సిలోనాలో జరిగింది. ఆ సమయంలో దిగిన ఈ ఫొటో.. నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!