కండక్టర్ వ్యాఖ్యతో.. ఆర్టీసీ బస్సులో కరోనా కలకలం..!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీకు కరోనా ఉందంటూ ఓ జంటకు కండక్టర్ గట్టిగా చెప్పడంతో తమిళనాడు ఆర్టీసీ బస్సులో

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీకు కరోనా ఉందంటూ ఓ జంటకు కండక్టర్ గట్టిగా చెప్పడంతో తమిళనాడు ఆర్టీసీ బస్సులో కలకలం రేగింది. కండక్టర్ చెప్పింది ఇతర ప్రయాణికుల చెవుల పడటంతో అందరూ పరుగుపరుగున బస్సులోంచి పారిపోయారు. పన్రూతి నుంచి కడలూర్ వెళుతున్న బస్సులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వారు కోవిద్-19 పరీక్షలు చేయించుకుని రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ జంటకు కరోనా సోకిందన్న విషయం ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడంతో వారు బస్సులోని కండక్టర్ను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆ దంపతులకు విషయం చెప్పాలని సూచించారు. అయితే కండక్టర్ ఈ విషయాన్ని దంపతులకు చెప్పడం ఇతర ప్రయాణికుల చెవుల పడటంతో బస్సులో కల్లోలం చెలరేగింది. మిగతా ప్రయాణికులందరూ ఒక్క ఉదుటున బస్సులోంచి బయటపడ్డారు.
Also Read: గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ చాలెంజ్.. టాప్ 10లో ముగ్గురు భారతీయులు..



