AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి టీఎంసీ కౌంటర్.. జైహింద్ నినాదంతో 10వేల పోస్టుకార్డులు!

పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ తీరుకు నిరసనగా ‘జైశ్రీరామ్’ నినాదంతో ఆమెకు 10 లక్షల పోస్టు కార్డులు పంపాలన్న బీజేపీ యోచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు ప్రతీకారంగానా అన్నట్లు వారు ప్రధాని నరేంద్ర మోదీకి ‘జైహింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అని నినాదాలు రాసిన 10 వేల పోస్టుకార్డులు పంపారు. ఇటీవల నార్త్ 24 పరాగణాల జిల్లాలోని భాత్పరా ప్రాంతంలో కొంతమంది బీజేపీ శ్రేణులు మమతా బెనర్జీ కాన్వాయ్ ముందుకు వచ్చి ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయడంతో […]

ప్రధాని మోదీకి టీఎంసీ కౌంటర్.. జైహింద్ నినాదంతో 10వేల పోస్టుకార్డులు!
Ravi Kiran
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jun 05, 2019 | 6:01 PM

Share

పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ తీరుకు నిరసనగా ‘జైశ్రీరామ్’ నినాదంతో ఆమెకు 10 లక్షల పోస్టు కార్డులు పంపాలన్న బీజేపీ యోచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు ప్రతీకారంగానా అన్నట్లు వారు ప్రధాని నరేంద్ర మోదీకి ‘జైహింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అని నినాదాలు రాసిన 10 వేల పోస్టుకార్డులు పంపారు.

ఇటీవల నార్త్ 24 పరాగణాల జిల్లాలోని భాత్పరా ప్రాంతంలో కొంతమంది బీజేపీ శ్రేణులు మమతా బెనర్జీ కాన్వాయ్ ముందుకు వచ్చి ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయడంతో ఆమె మండిపడిన సంగతి తెలిసిందే. వెంట‌నే కారును నిలిపివేసి, కిందికి దిగి తీవ్రస్వరంతో వారిని హెచ్చరిస్తూ అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

‘బీజేపీ కార్యకర్తలు ఓ సీఎం కారు ముందుకు వచ్చి ‘జైశ్రీరామ్’ నినాదాలు చేయవచ్చా.. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఓ టీఎంసీ కార్యకర్త. ఒక్క సీఎం కాన్వాయ్ మాత్రమే కాదు వారు తమ ఎమ్మెల్యేల, ఎంపీల దగ్గర కూడా ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. కానీ తాము ఎప్పుడూ ఇలాంటి తప్పుడు చర్యలు చేయమని.. ప్రధాని కాన్వాయ్ కి అడ్డుపడమని దేబశ్రీ బెనర్జీ అనే ఆ కార్యకర్త పేర్కొన్నారు. కేవలం బీజేపీ శ్రేణుల తీరుకు నిరసన గానే మేము కూడా  10,000 పోస్టులు ప్రధానికి పంపామని  ఆయన అన్నారు.