పుల్వామా ఘటనతో జమ్ము విద్యార్ధుల పాలిట దైవంగా మారిన ఇత్రాత్

పుల్వామా ఘటన అనంతరం చెలరేగిన ఆందోళనలు జమ్ముకశ్మీర్ విద్యార్ధుల పాలిట శాపమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్ధులకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. 24 గంటల్లో మీ రాష్ట్రం వెళ్లాలంటూ పలు సంస్థలు బెదిరింపులకు దిగడంతో కశ్మీరీ విద్యార్ధులు తీవ్ర భయానక పరిస్థితులను చూశారు. ఈ తీవ్ర పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్ విద్యార్ధులను వారి సొంత స్థలాలకు చేర్చడానికి జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ఇత్రాత్ కీలక పాత్ర పోషించాడు. ఇంతకు అసలు కశ్మీరీ విద్యార్ధులకు బెదిరింపులు […]

పుల్వామా ఘటనతో జమ్ము విద్యార్ధుల పాలిట దైవంగా మారిన ఇత్రాత్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:02 PM

పుల్వామా ఘటన అనంతరం చెలరేగిన ఆందోళనలు జమ్ముకశ్మీర్ విద్యార్ధుల పాలిట శాపమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్ధులకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. 24 గంటల్లో మీ రాష్ట్రం వెళ్లాలంటూ పలు సంస్థలు బెదిరింపులకు దిగడంతో కశ్మీరీ విద్యార్ధులు తీవ్ర భయానక పరిస్థితులను చూశారు. ఈ తీవ్ర పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్ విద్యార్ధులను వారి సొంత స్థలాలకు చేర్చడానికి జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ఇత్రాత్ కీలక పాత్ర పోషించాడు. ఇంతకు అసలు కశ్మీరీ విద్యార్ధులకు బెదిరింపులు ఎలా మొదలయ్యాయి? వీరిని స్వస్థలాలకు తరలించిన ఈత్రాత్ ఎవరు? అతని గతం ఏంటి? వందల మంది విద్యార్ధులను ఎలా తరలించాడు? ఈ స్టోరీలో చూద్ధాం.

అసలు బెదిరింపులు ఎలా ప్రారంభమయ్యాయి..? ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ కు చెందిన ఆదిల్ అనే జైషే ఎ మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన యువకులు ఓ కారుతో సీఆర్ఫీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై దాడికి దిగాడు. ఈ ఘటనలో 49మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ద గంటల్లోనే దాడికి పాల్పడ్డది జమ్ముకశ్మీర్ వ్యక్తి అని ప్రచారం అవ్వడంతో ఉత్తరాఖండ్ లో జమ్ముకశ్మీర్ విద్యార్ధులకు బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. దీంతో డెహ్రాడూన్ లో చదువుకుంటున్న విద్యార్ధులకు అక్కడి పలు సంస్థలు బెదిరింపులకు దిగాయి. మీరంతా 24గంటల్లో డెహ్రాడూన్ వదిలి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగాయి పలు రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్. దీంతో భయబ్రాంతులకు గురైన జమ్ముకశ్మీర్ విద్యార్ధులు వారికి సంబంధించిన సంస్థ అయిన JKSO ని సంప్రదించారు.

ఇంతకు ఈ JKSO ఏమిటి…?

జమ్ముకశ్మీర్ లో ఉన్నత విద్య చదువుకోవడం ఓ సహాసమైన పని. కారణం నిత్యం అక్కడ ఉన్న భయానక పరిస్థితులు. దీంతో ఉన్నత విద్య కోసం విద్యార్ధులు పొరుగు రాష్ట్రాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు ఏదైన ఆపద వస్తే ఆదుకునేందుకు ఓ ఆర్గనైజేషన్ ఉండాలన్న ఆశయంతో ఈత్రాత్ అనే మోకానికల్ విద్యార్ధి 2017లో జమ్ము కశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించాడు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ విద్యార్ధులందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నించేవాడు. అయితే ఇదే సమయంలో ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడితో కశ్మీరీ విధ్యార్ధులకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. దీంతో తమని కాపాడాలంటూ జమ్ముకశ్మీరీ విద్యార్ధులు ఈత్రాత్ కు పెద్ద ఎత్తున కాల్స్ చేయడం మొదలు పెట్టారు. జమ్ముకశ్మీర్ విద్యార్ధుల కోసం ఓ హెల్ప్ లైన్ నంబరును కూడా ఈత్రాత్ ఏర్పాటు చేశాడు. ఈ హెల్ప్ లైన్ కు సగటున రోజుకు 300 కాల్స్ స్వీకరించినట్లు ఈత్రాత్ తెలిపారు. ఘటన జరిగిన తరువాత కేవలం ఐదురోజుల్లో ఈత్రాత్ జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 800మందిని కశ్మీర్ కు తరలించినట్లు తెలిపాడు.

డెహ్రాడూన్ లో అసలు ఏం జరిగింది..?

పుల్వామా ఘటన అనంతరం డెహ్రాడూన్ లో రైట్ వింగ్ సంస్థల బెదిరింపులతో కశ్మీరీ విద్యార్ధులు భయబ్రాంతులకు గురయ్యారు. ఓ విద్యార్ధిపై గుర్తుతెలియని వ్యక్తులు తలపై బాది 24గంటల్లో డెహ్రాడూన్ వదిలి వెళ్లాలని హెచ్చరించారు. దీంతో ఆ విషయాన్ని తన సహచర విద్యార్ధులకు తెలియజేశాడు. దీంతో అక్కడి విద్యార్ధులు భయబ్రాంతులకు గురై.. రూంలన్నీ ఖాళీ చేశారు. ఒకే రూంలో 20మంది వరకు ఉంటూ.. డోర్ లాక్ వేసుకున్నారు. తమను ఏలాగైన రక్షించాలంటూ ఈత్రాత్ కు కాల్స్ చేశారు. తమ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని.. రెండు రోజుల నుంచి కనీసం ఆహారం కూడా లేదని వాపోయారు. అయితే ఘటనపై అక్కడి సీఆర్ఫీఎఫ్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే వారు ఓ హెల్ప్ నంబర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం డెహ్రాడూన్ లో కశ్మీరీ విద్యార్ధుల పట్ల ఏలాంటి బెదిరింపులు లేవని.. అవన్నీ అవాస్థవాలని కొట్టి పారేశారు. దీంతో చేసేందేమీ లేక అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్ధులు కశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించగా ట్రాన్స్ పోర్ట్ ధరలు నింగినంటాయి. అయితే వీరందరిని కశ్మీర్ కు తరలించేందుకు ఈత్రాత్ తనవంతు ప్రయత్నాలు చేశాడు. డెహ్రాడూన్ నుంచి చంఢీగడ్ తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాడు. అనంతరం చంఢీగడ్ లోని ఓ గురుద్వారాలో వారందరికీ షెల్టర్ ఏర్పాటు చేశాడు. రెండు రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో వారందరికీ అక్కడే ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశాడు. అనంతరం అక్కడి నుంచి 17ట్రక్కులను ఏర్పాటు చేసి దాదాపు 200మందిని రెండురోజుల్లో జమ్ముకశ్మీర్ కు తరలించాడు.

ఈత్రాత్ ఎవరు..?

ఉత్తర కశ్మీర్ కు చెందిన ఈత్రాత్.. 2008లో క్యాన్సర్ వ్యాధితో తన తల్లిని కోల్పోగా..2011లో గుండెపోటుతో తన తండ్రిని కోల్పోయాడు. ఇతని కుటుంబ సభ్యులంతా అక్కడే నివసిస్తున్నారు. అయితే కశ్మీర్ లో జీవించడం చాలా కష్టమని. ఈత్రాత్ భావించేవాడు. తను పాఠశాల వెళ్లి వస్తుండగా సైనికులు తమ గుర్తింపు కార్డులను చూపిస్తేనే వదిలేసేవారని తెలిపాడు. అయితే జమ్ముకశ్మీర్ లో ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఇక్కడ జీవించడం కష్టమని భావించేవాడు. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ శాంతినెలకొనాలని ఈత్రాత్ భావించేవాడు. ఇతను మోకానికల్ ఇంజనీరింగ్ చదివిన అనంతరం జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ప్రారంభించాడు. జమ్ముకశ్మీర్ విషయంలో 1947 నుంచి భారత్, పాక్ ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని ఈత్రాత్ అంటున్నాడు. ఇరు దేశాల మధ్య జమ్ముకశ్మీర్ యువకులు నలిగిపోతున్నారని ఈత్రాత్ తెలిపాడు.

ఎన్డీఏలో చేరాలనుకున్న ఈత్రాత్..

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఈత్రాత్ చేరాలనుకున్నాడు. అయితే ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే ప్లస్ టూ చదువుతున్న సమయంలో ఇక ఎన్డీఏ లో చేరేందుకు ప్రయత్నించాడు. అయితే ఇదే సంవత్సరం తనకు ఓ షాక్ తగిలింది. తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓ ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సౌండ్ సిస్టమ్ విషయంలో అక్కడి సైనికాధికారులు సౌండ్ సిస్టమ్ ను నిలిపివేయించారు. అనంతరం వీరి వద్ద నుంచి గుర్తింపు కార్డులను తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సమయంలో ఈత్రాత్ అక్కడి మేజర్ ను కలిశాడు. అయితే నేను ఎన్డీఏ లో చేరాలనుకుంటున్నాను అని ఈత్రాత్ మేజర్ కు తెలియజేయడంతో.. ఆ మేజర్ అన్న వ్యాఖ్యలతో ఈత్రాత్ నిర్ఘాంతపొయాడు. మీ వంటి రాడికల్స్ ఎన్డీఏకు సరిపోరు అంటూ.. మీకు తెలివి ఉండదని.. అవహేళన చేశాడని ఈత్రాత్ తెలిపాడు. దీంతో ఈత్రాత్ తన ఎన్డీఏ కలను కలగానే మిగిల్చుకున్నాడు. అనంతరం తన ఉన్నత చదువులు ముగిసిన వెంటనే జమ్ముకశ్మీర్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించాడు. ఇప్పుడు పుల్వామా ఘటనతో జమ్ముకశ్మీర్ విద్యార్ధులకు ఈ నవయువకుడు దైవంలా మారాడు.